జ్యోతిష్యశాస్త్రంలో ప్రకృతికి, గ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంది. సూర్యుడు రోహిణి నక్షత్రరాశిలోకి ప్రవేశించినప్పుడు భూమిపై ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ కాలంలోని మొదటి తొమ్మిది రోజులను 'నౌతాపం' అని అంటారు. ఈ వేసవి సమయంలో చెట్లకు నీరు పోయడం, కొత్త మొక్కలను నాటడం చాలా శుభకార్యంగా పరిగణిస్తారు. జ్యోతిష్యం ప్రకారం నౌతాపంలో కొన్ని మొక్కలను నాటడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి, జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఆ మొక్కలు ఏంటో చూద్దాం..
రావి చెట్టు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రావి చెట్టు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిలయం. నౌతాపంలోని వేసవి కాలంలో బహిరంగ ప్రదేశంలో లేదా ఆలయ ప్రాంగణంలో రావి చెట్టును నాటడం వల్ల పితృ దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే శని దృష్టితో బాధపడేవారు ఈ చెట్టును నాటి, శనివారం నాడు నువ్వుల దీపాన్ని వెలిగిస్తే సడేసతి, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది.
తులసి
హిందూమతంలో తులసి మెుక్కకు చాలా ప్రాధాన్యత ఉన్నది. నౌతాపంలో ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదం. ఇది లక్ష్మీదేవికి ప్రతీక, ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపద, ధాన్యం వృద్ధి చెందుతాయి. ప్రతి సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం ఇంట్లో శాంతిని చేకూరుస్తుంది.
వేప, మర్రి చెట్టు
వేప చెట్టును నాటడం నవగ్రహాల ఆరోగ్యాన్ని, శాంతిని మెరుగుపరచడానికి చాలా మంచిది. వేప చెట్టు దుర్గాదేవి నిజ స్వరూపం అని నమ్ముతారు. అదేవిధంగా మర్రి చెట్టును నాటడం వల్ల కుటుంబ వృక్షం వృద్ధి చెంది, ఇంటికి సానుకూల శక్తిని అందిస్తుంది.
జమ్మి
శమీ మొక్క(జమ్మి) శని దేవునికి చాలా ప్రీతికరమైనది. జాతకంలో శని దోషం ఉంటే నౌతాపం సమయంలో శమీ మొక్కను నాటడం బెటర్. ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున లేదా ఈశాన్య దిశలో నాటడం వల్ల పని, వ్యాపారంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఇంటి సభ్యులకు విజయాన్ని, దీర్ఘాయువును అందిస్తుంది.
{{/usCountry}}శమీ మొక్క(జమ్మి) శని దేవునికి చాలా ప్రీతికరమైనది. జాతకంలో శని దోషం ఉంటే నౌతాపం సమయంలో శమీ మొక్కను నాటడం బెటర్. ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున లేదా ఈశాన్య దిశలో నాటడం వల్ల పని, వ్యాపారంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఇంటి సభ్యులకు విజయాన్ని, దీర్ఘాయువును అందిస్తుంది.
{{/usCountry}}నౌతాపం సమయంలో ఈ మొక్కలను తూర్పు లేదా ఉత్తరం వైపుగా నాటడం శుభప్రదం. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి ఈ మొక్కలను నాటడం వల్ల జాతకంలో సూర్యుని శక్తి వృద్ధి చెంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈ తొమ్మిది రోజులలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. మొక్కలు వాడిపోకుండా ఉండటానికి వాటిని నాటిన తర్వాత ప్రతిరోజూ శ్రద్ధగా నీరు పోసి పోషించడం చాలా అవసరం.