...
...
Next Story

జగన్నాథుడి విగ్రహాలు ఎలా తయారయ్యాయి? పూరీ ఆలయం వెనుక అద్భుత పురాణ కథ

పూరీ జగన్నాథ రథయాత్ర వెనుక వేల ఏళ్ల నాటి పురాణ గాథ దాగి ఉంది. రాజు ఇంద్రద్యుమ్నుడి భక్తి, శ్రీహరి కలలో ఇచ్చిన దివ్య సందేశం, విశ్వకర్మ నిర్మించిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాల ప్రత్యేకత, రథయాత్ర ఆధ్యాత్మిక మహిమ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jul 16, 2026, 14:01:05 IST
Advertisement

పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర అంటేనే భక్తులకు కన్నుల పండుగ. ఆ దేవదేవుడు గర్భాలయం దాటి, వీధుల్లోకి వచ్చి భక్తులకు సాక్షాత్కరించడం వెనుక వేల ఏళ్ల నాటి చరిత్ర, అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి. అసలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిల విగ్రహాలు ఎలా తయారయ్యాయి? శతాబ్దాల క్రితం రాజు ఇంద్రద్యుమ్నుడికి స్వయంగా శ్రీహరి కలలో కనిపించి ఏం చెప్పారు? ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

భక్తుడి కోరికను తీర్చిన శ్రీహరి

జగన్నాథుడి విగ్రహాలు ఎలా తయారయ్యాయి? పూరీ ఆలయం వెనుక అద్భుత పురాణ కథ
జగన్నాథుడి విగ్రహాలు ఎలా తయారయ్యాయి? పూరీ ఆలయం వెనుక అద్భుత పురాణ కథ

పురాణాల ప్రకారం, రాజు ఇంద్రద్యుమ్నుడు శ్రీమహావిష్ణువుకు పరమ భక్తుడు. తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా స్వామిని కళ్లారా చూడాలని, ఆ పరమాత్ముడు తన రాజ్యంలోనే కొలువై ఉండాలని ఆయన తీవ్రంగా పరితపించేవారు. భక్తుడి భక్తికి మెచ్చిన జగన్నాథుడు, ఆయనకు సాక్షాత్కారం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓ రాత్రి, తన ఆరాధ్య దైవం కోసం చింతిస్తూ నిద్రపోయిన రాజుకు, స్వయంగా శ్రీహరి దర్శనమిచ్చాడు.

కల చాలా స్పష్టంగా ఉంది. గరుడ వాహనంపై, శంఖు, చక్ర, గద, ధనుర్బాణాలతో నీల మేఘశ్యాముడిగా విష్ణుమూర్తి రాజుకు కనిపించాడు. "నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను. సముద్ర తీరానికి వెళ్లు. అక్కడ నీకు ఒక మహా వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం సగం నీటిలో, సగం ఒడ్డున ఉంటుంది. ఆ కాండం నుంచి నా విగ్రహాలను రూపొందించుకో" అని ఆజ్ఞాపించాడు.

విశ్వకర్మ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణం

మరుసటి రోజు ఉదయాన్నే రాజు సముద్ర తీరానికి పరుగుతీశాడు. స్వామి చెప్పినట్లుగానే అక్కడ దివ్యమైన కాంతితో మెరిసే ఒక మహా వృక్షం కనిపించింది. ఆ వృక్షాన్ని తీసుకువచ్చి, దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి విగ్రహాలను తయారు చేయమని కోరాడు.

జగన్నాథుడి రథయాత్ర ఎందుకు ఇంతటి విశిష్టత కలిగి ఉంటుంది? రథం ముందు నడిచేవారు, రథం తాడును పట్టుకుని లాగేవారు నేరుగా వైకుంఠ ప్రాప్తిని పొందుతారని భక్తుల నమ్మకం. స్వామివారి ముఖారవిందాన్ని చూస్తూ, ఆ రథం వెళ్లే దారిలో పడే ధూళిని కూడా పవిత్రంగా భావిస్తారు. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో భాగస్వాములవుతారు. భగవంతుడే స్వయంగా తన భక్తుల కోసం వీధుల్లోకి వచ్చే ఈ అద్భుత ఘట్టం, సనాతన ధర్మంలో అత్యంత కీలకమైనది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe