ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంచుకోండి.. డబ్బు వర్షం కురుస్తుంది.. కానీ ఏ దిశలో పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం స్ఫటిక తాబేలు శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద, ఆరోగ్యం, సామరస్యం పెరుగుతాయని నమ్మకం.

Published on: May 23, 2026, 12:44:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో, వాస్తు శాస్త్రంలో తాబేలుకు చాలా ప్రముఖమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని మోయడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారం రూపం ధరించారు. క్షీరసాగర మథనానికి తాబేలు ఆధారం కావడం, దాని నుండే లక్ష్మీదేవి జన్మించడం వల్ల, ఎక్కడ తాబేలు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. అందుకే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల విష్ణుమూర్తి, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని వాస్తు నిపుణులు, పండితులు చెబుతుంటారు.

స్పటిక తాబేలు లాభాలు
స్పటిక తాబేలు లాభాలు

ఇళ్లలో, కార్యాలయాలలో స్ఫటిక తాబేళ్లను ఉంచడం ఒక కొత్త పోకడగా మారింది. స్ఫటికాలకు సహజంగానే ప్రతికూల శక్తిని గ్రహించి, సానుకూల శక్తిని విడుదల చేసే గుణం ఉంటుంది. ఇంట్లో నిరంతర గొడవలు, మానసిక అశాంతి, ఆర్థిక సమస్యలు వంటివి ఉన్నప్పుడు, ఒక స్ఫటిక తాబేలును తీసుకురావడం ఆయా ఇళ్లలోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసే ఒక అద్భుతమైన వాస్తు సాధనం కూడా.

అయితే ఇంట్లో స్ఫటిక తాబేలును ఉంచేటప్పుడు వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, స్ఫటిక తాబేలును ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం ఎల్లప్పుడూ చాలా శుభప్రదం. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కాబట్టి, ఈ దిశలో తాబేలును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి. సంపద ఆకర్షణ పెరుగుతుంది. అలాగే వాణిజ్య సంస్థలు, కార్యాలయాలలో దీనిని నగదు పెట్టె దగ్గర లేదా ఉత్తర దిశలో ఉంచడం వల్ల వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి.

స్ఫటిక తాబేలును ఉంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం దానిని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఒక చిన్న గాజు లేదా రాగి గిన్నెలో కొంత శుభ్రమైన నీటిని పోసి, ఆ నీటిలో ఈ స్ఫటిక తాబేలును పెట్టాలి. ఆ తాబేలు ఎల్లప్పుడూ ఇంటి లోపలికి అభిముఖంగా ఉండాలి, తలుపు వైపు గానీ లేదా బయటికి గానీ కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలు లోపలికి అభిముఖంగా ఉంటే ఇంటికి సంపద వస్తుంది, అదే బయటికి అభిముఖంగా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పాత్రలోని నీటిని ప్రతిరోజూ మార్చడం, దానిని పవిత్రంగా ఉంచడం వలన మీరు ప్రయోజనాలను త్వరగా పొందగలుగుతారు.

ఆరోగ్యం పరంగా తాబేలును దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణిస్తారు. తాబేళ్లు వందల సంవత్సరాలు జీవిస్తాయి. ఇంట్లో తాబేలును ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. న్యూమరాలజీ నిపుణుల ప్రకారం.. ఒక చిన్న స్ఫటిక తాబేలును ఉత్తర దిశలో, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లల గదులలో లేదా వారు కూర్చునే బల్లపై ఉంచితే.. అది వారి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుందని, చదువులో రాణిస్తారని అంటారు.

మీరు కూడా ఆర్థిక అభివృద్ధిని.. మీ ఇంట్లో శాంతి కోసం ఒక స్ఫటిక తాబేలును తీసుకువచ్చి, దానిని ఉత్తర దిశలో ఉన్న ఒక నీటి పాత్రలో ప్రతిష్ఠించండి. ఇది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తులను తొలగించడమే కాకుండా.. అన్ని అడ్డంకులను తొలగించి, దానిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More