Summer Healthy Drinks : వేసవిలో ఆరోగ్యం మీ చేతుల్లోనే..! డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఈ పానీయాలకు దూరంగా ఉండండి!

Summer Hydration Tips Telugu : ఎండలు మండిపోతున్న వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. అయితే మనం తీసుకునే కొన్ని పానీయాలు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆరోగ్యకరమైన వేసవి పానీయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి….

Published on: May 8, 2026, 15:16:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Summer Hydration Tips Telugu : ప్రస్తుత వేసవి కాలంలో శరీరాన్ని నిర్జలీకరణం నుంచి కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. శరీరంలో నీటి శాతం తగ్గితే అది అలసటకే కాకుండా, తీవ్రమైన హీట్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. అయితే… దాహం వేసినప్పుడు దొరికిన పానీయం తాగడం కంటే, ఏది మన శరీరానికి మేలు చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో ఆరోగ్యం మీ చేతుల్లోనే....! (Picture credit: Adobe Stock )
వేసవిలో ఆరోగ్యం మీ చేతుల్లోనే....! (Picture credit: Adobe Stock )

కల్ట్ (Cult) పోషకాహార నిపుణురాలు మధురా పి బెహ్కీ అభిప్రాయం ప్రకారం…. హైడ్రేషన్ అంటే కేవలం నీరు తాగడం మాత్రమే కాదు. శరీర అవసరాలకు తగ్గట్టుగా తెలివైన పానీయాలను ఎంచుకోవడం. కొన్ని పానీయాలు మనల్ని చల్లబరుస్తాయని మనం అనుకుంటాం… కానీ అవి శరీరంలో చక్కెర స్థాయిలను పెంచి, మనల్ని మరింత నీరసంగా మారుస్తాయి.

ఈ పానీయాలకు దూరంగా ఉండండి:

చాలా పానీయాలు కేవలం 'ఖాళీ కేలరీల'ను (Empty Calories) మాత్రమే అందిస్తాయి. మీరు ఈ క్రింది వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.

  • ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్: వీటిలో ఫైబర్ తక్కువగా ఉండి, చక్కెరలు మరియు ఫ్రూట్ కాన్సంట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచి, ఆపై శక్తిని వేగంగా తగ్గించివేస్తాయి.
  • ఐస్డ్ టీ: ఇందులో ఉండే అధిక చక్కెర.. కెఫీన్ మూత్రవిసర్జనను పెంచి, శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి.
  • ప్రీ-ప్యాకేజ్డ్ ప్రోటీన్ షేక్స్: వీటిని జీర్ణం చేసుకోవడం శరీరానికి కష్టమవుతుంది. ఆహారం యొక్క థర్మిక్ ప్రభావం వల్ల ఇవి శరీరంలో వేడిని సృష్టిస్తాయి. దీనివల్ల ఉబ్బరం లేదా మందకొడిగా అనిపిస్తుంది.
  • శీతల పానీయాలు: ఫ్లేవర్డ్ సోడాల్లో ఉండే విపరీతమైన చక్కెర వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.

ప్రత్యామ్నాయాలు:

  • కొబ్బరి నీరు: సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లతో నిండిన కొబ్బరి నీరు శరీరానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఇందులో అదనపు చక్కెర ఉండదు కాబట్టి ఇది సురక్షితం.
  • కోకుమ్ రసం: ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. భోజనం తర్వాత దీనిని తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
  • మూలికా నీరు: సాదా నీరు తాగడం బోర్ కొడితే, పుదీనా ఆకులతో పుచ్చకాయ ముక్కలు, నారింజ, నిమ్మకాయ స్లైసులు లేదా సోంపు మరియు తులసి కలిపిన నీటిని తాగవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన చల్లదనాన్ని మరియు ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వృత్తిపరమైన వైద్య సలహా కోసం మీ డాక్టరును సంప్రదించండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More