కుజ గోచారం 2026: అదృష్టం వరించే 5 రాశులు ఇవే!
జూన్ 21న కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి ఇంట్లో అంగారకుడి అడుగు పెట్టడం వల్ల ఐదు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. అపార ధనలాభం, కెరీర్లో విజయం దక్కే ఆ రాశుల వివరాలు.
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పునకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జూన్ 21న నవగ్రహాలలో సేనాధిపతి అయిన కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నేటి నుంచి సరిగ్గా 11 రోజుల తర్వాత జరగబోయే ఈ గ్రహ మార్పును జ్యోతిష్య పరంగా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. సాధారణంగా కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి, అంతులేని శక్తికి ప్రతీక. మరోవైపు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల ఆ రాశి సుఖసంతోషాలు, విలాసాలు, ఆర్థిక స్థిరత్వానికి సంకేతంగా నిలుస్తుంది.

శక్తికి కారకుడైన కుజుడు, లగ్జరీకి కారకుడైన శుక్రుడి రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఇల్లు, కుటుంబ విషయాలలో వీరు అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఈ గోచారం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, మీనం, ధనుస్సు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగనున్నాయి. "కుజుడి ఈ మార్పు వల్ల ఈ ఐదు రాశుల వారికి తిరుగుండదు, అదృష్టం వరిస్తుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ఆయా రాశులపై చూపే ప్రభావం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం లాంటిదని చెప్పవచ్చు. మీ వ్యక్తిత్వంలో విపరీతమైన నిఖార్సు వస్తుంది, సమాజంలో ఆకర్షణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. భవిష్యత్తులో మీ ఎదుగుదలకు తోడ్పడే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో సరికొత్త పురోగతి కనిపిస్తుంది. ప్రేమ జీవితం కూడా ఎంతో మధురంగా సాగుతుంది, భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మొత్తంగా ఈ గోచారం వృషభ రాశి వారికి అన్ని విధాలా లాభాలను తెచ్చిపెడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈ గ్రహ సంచారం ఎన్నో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారంలో కొత్త డీల్స్ కుదిరే అవకాశాలు ఉన్నాయి, దీనివల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలు అందుకుంటారు.
సింహ రాశి
కుజుడి స్థాన చలనం వల్ల సింహ రాశి వారు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారు. కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆఫీసులో మీ పనికి పైఅధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. అయితే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున, బడ్జెట్ ప్లాన్ చేసుకుని ముందుకు సాగడం మంచిది. ఇంతకాలం నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకుపోతాయి.
మీన రాశి
మీన రాశి వారిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మునుపటి కంటే ఎక్కువ చురుగ్గా, పట్టుదలగా శ్రమిస్తారు. కెరీర్లో ముందుకు వెళ్లడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీ కష్టానికి తగ్గ పూర్తి ఫలితాన్ని దక్కించుకుంటారు. కాస్త ఓపికతో వ్యవహరిస్తే పనులన్నీ అనుకున్న దిశగా సాగుతాయి. పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడంపై ఈ కాలంలో ఎక్కువ శ్రద్ధ పెడతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు రాబోయే రోజుల్లో సరికొత్త అవకాశాలు స్వాగతం పలుకుతాయి. ఉద్యోగ మార్పు లేదా వ్యాపార విస్తరణ విషయంలో సానుకూల నిర్ణయాలు వస్తాయి. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు నెమ్మదిగా పూర్తి అవుతాయి. కార్యాలయంలో మీ శ్రమకు తగ్గ ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించడం వల్ల మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగిపోతాయి. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకుంటే భారీ లాభాలు ఉంటాయి.
కుజ గోచార సమయంలో చేయాల్సిన పరిహారాలు
ఈ గ్రహ మార్పు కాలంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కుజ దోషాలు తొలగి మేలు జరుగుతుంది. లేని వారికి, పేదలకు సహాయం చేయడం మంచిది. మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు, బెల్లం, ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగడం వల్ల కుజుడి అనుగ్రహాన్ని పూర్తిగా పొందవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


