ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి, కష్టాలు తీరిపోవచ్చు!

వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఏ విధమైన బాధలు ఉండవు. పైగా, ఈరోజు పుత్రదా ఏకాదశి కూడా. పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే పుత్రుడు జన్మిస్తాడని. ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించడం వలన ఆనందంగా ఉండొచ్చని నమ్ముతారు.

Published on: Dec 30, 2025 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విష్ణువు అనుగ్రహం కలగాలని వివిధ రకాల మార్గాలను అనుసరిస్తారు. ముఖ్యంగా ఏకాదశి తిథి నాడు విష్ణువుని ఆరాధిస్తే ఎంతో మేలు కలుగుతుందని, అనుకున్నవన్నీ పూర్తవుతాయని నమ్మకం. విష్ణు అనుగ్రహంతో దేనికీ లోటు ఉండదు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశేషమైనది. ఇంత విశిష్టత కలిగిన ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు కలుగుతుంది. బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.

ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి (pinterest)
ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి (pinterest)

అలాగే, విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఏ విధమైన బాధలు ఉండవు. పైగా, ఈరోజు పుత్రదా ఏకాదశి కూడా. పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే పుత్రుడు జన్మిస్తాడని, అలాగే పిల్లలు ఉన్నవారు ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించడం వలన పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఆనందంగా ఉండొచ్చని నమ్ముతారు. ఎంతో విశేషమైన వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువుకి ఈ పువ్వులను సమర్పించండి.

ఈరోజు విష్ణువుకి ఈ పూలను సమర్పించండి

1.గులాబీ పువ్వులు:

గులాబీ పువ్వులను విష్ణువుకి సమర్పించండి. ఎర్ర గులాబీలను విష్ణువుకి, లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం, ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

2.పారిజాతం పువ్వులు:

పారిజాతం పువ్వులు కూడా విష్ణువుకి ఎంతో ఇష్టం. పారిజాతం పువ్వులను విష్ణుమూర్తికి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సమర్పిస్తే అనేక లాభాలు కలుగుతాయి. పారిజాతం పువ్వులు విష్ణువుకి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంతోషం, సంపద కలిగి జీవితంలో పైకి రావచ్చు. అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి.

3.తామర పువ్వులు:

విష్ణువుకి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులను కూడా సమర్పించండి. వీటిని సమర్పించడం వలన ఆనందం, సంపద కలుగుతాయి. పసుపు లేదా ఎర్రటి తామర పువ్వులను విష్ణువుకి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సమర్పించండి.

4.కదంబ పువ్వులు:

విష్ణువుకి, లక్ష్మీదేవికి కదంబ పువ్వులను సమర్పిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. విష్ణు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. అలాగే సువాసన వచ్చే మల్లె, కదంబ, సంపంగి పుష్పాలను కూడా విష్ణువుకి సమర్పించవచ్చు.

5.విష్ణుకాంత:

విష్ణువుకి ఈ విష్ణుకాంత పువ్వులను సమర్పిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఇవి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనవి. కనుక ఈ ఏకాదశి నాడు విష్ణువుకి వీటిని కూడా సమర్పించండి.

6.తులసి దళాలు:

విష్ణువుకి తులసి దళాలను కూడా తప్పక సమర్పించండి. ఇవి లేనిదే విష్ణువుకి చేసిన పూజ సంపూర్ణం కాదు. కాబట్టి కచ్చితంగా తులసి దళాలను ఏకాదశి ముందు రోజే కోసుకొని విష్ణువుకి సమర్పించడం మంచిది.