Lunar Eclipse August 2026 : ఆగస్టులో రెండో చంద్ర గ్రహణం - ఇది మన దేశంలో కనిపిస్తుందా...? రాఖీ పండుగపై ప్రభావం ఎంత...?

ఆగస్టు 28, 2026న రక్షాబంధన్ పర్వదినం రోజే ఈ ఏడాది చివరి సంపూర్ణ చంద్రగ్రహణం (బ్లడ్ మూన్) సంభవించనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం వల్ల రాఖీ పండుగ జరుపుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవని జ్యోతిష్య పండితులు స్పష్టం చేశారు.

Published on: May 31, 2026, 11:14:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lunar Eclipse August 2026 : ఖగోళ ప్రేమికులతో పాటు అటు ఆధ్యాత్మిక సమాజంలోనూ 2026 నాటి చంద్రగ్రహణంపై ఒక ప్రత్యేకమైన ఆసక్తి, ఉత్సాహం నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఒక అరుదైన ఖగోళ దృగ్విషయం జరగబోతోంది. 2026 సంవత్సరంలోనే రెండోది మరియు చివరిదైన ఈ చంద్రగ్రహణం సరిగ్గా పౌర్ణమి తిథి రోజున సంభవించనుంది.

చంద్రగ్రహణం
చంద్రగ్రహణం

సాధారణంగానే పౌర్ణమి రోజున వచ్చే చంద్రగ్రహణానికి హిందూ మత శాస్త్రాలలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే…. ఈసారి మరింత విశేషం ఏమిటంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం పవిత్రమైన రక్షాబంధన్ (రాఖీ పండుగ) రోజే రాబోతోంది. దీనితో సోదరసోదరీమణుల అనురాగ వేడుకపై ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా..? లేదా..? అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

రక్షాబంధన్ రోజే 'బ్లడ్ మూన్'.. ఎప్పుడు? ఎక్కడ?

శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున దేశమంతటా రక్షాబంధన్ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జ్యోతిష్య గణనల ప్రకారం.. ఈసారి ఆగస్టు 28, 2026న ఈ పండుగ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది.

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం 'సంపూర్ణ చంద్రగ్రహణం' (Total Lunar Eclipse) కావడం విశేషం. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతాడు. దీనినే శాస్త్ర సాంకేతిక భాషలో, సాధారణ వాడుకలో 'బ్లడ్ మూన్' (Blood Moon) అని పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడికి మధ్యలోకి భూమి వచ్చినప్పుడు.. భూమి యొక్క దట్టమైన నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఈ అద్భుతమైన ఎరుపు రంగు కాంతి మనకు గోచరిస్తుంది.

ఈ ఖగోళ అద్భుతం ప్రధానంగా యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా ఖండంతో పాటు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

భారతదేశంపై దీని ప్రభావం ఉంటుందా…?

రాఖీ పండుగ రోజే గ్రహణం వస్తుండటంతో భారతీయులలో నెలకొన్న ప్రధాన సందేహాన్ని జ్యోతిష్య పండితులు నివృత్తి చేశారు. ఈ ఆగస్టు 28న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ గ్రహణమైనా సరే మన కంటికి కనిపించనప్పుడు…. దాని వల్ల వచ్చే 'సూతక కాలం' (దోష సమయం) మన దేశానికి వర్తించదు.

కాబట్టి…. గ్రహణ సూతక నియమాలు కానీ, పూజా నిరోధాలు కానీ మనకు ఉండవు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎటువంటి భయాందోళనలు, టెన్షన్లు లేకుండా ఎప్పటిలాగే రక్షాబంధన్ పండుగను, రాఖీ కట్టే ముహూర్తాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవచ్చు.

శాస్త్రీయంగా ఇదొక ఖగోళ ప్రక్రియ అయినప్పటికీ.. హిందూ సంస్కృతిలో గ్రహణ కాలానికి, ఆ తర్వాత చేసే క్రతువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహణం ఎక్కడైనా సంభవించినప్పుడు విశ్వంలో వచ్చే మార్పుల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు పాటించడం శుభప్రదమని నమ్ముతారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకోవడం, పవిత్ర స్నానాలు ఆచరించడం ఉత్తమం. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి, పేదలకు శక్తి కొలది దానం చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు పేర్కొంటున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More