పునర్వసు నక్షత్రంలోకి బుధుడు - ఈ రాశుల వారికి 58 రోజుల పాటు డబుల్ జాక్పాట్..!
Mercury Transit Punarvasu Nakshatra: గ్రహాల యువరాజు బుధుడు త్వరలో పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. బృహస్పతి నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన ధనలాభం, అదృష్టం కలిసిరానుంది.
జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. బుద్ధి, సంప్రదింపులు, వ్యాపారం, వాదన, తార్కిక సామర్థ్యానికి బుధుడిని అధిపతిగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలను అందుకుంటాడు. ప్రస్తుతం ఆర్ద్ర నక్షత్రంలో కొనసాగుతున్న బుధుడు, త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. దేవగురు బృహస్పతికి చెందిన పునర్వసు నక్షత్రంలోకి బుధుడి ప్రవేశం జరగనుంది.

హిందూ పంచాంగం ప్రకారం…. జూన్ 11, 2026 న ఉదయం 11:30 గంటలకు బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 8, 2026 ఉదయం వరకు అంటే సుమారు 58 రోజుల పాటు బుధుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. బృహస్పతి నక్షత్రంలో బుధుడి ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని పెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం బంపర్ ప్రయోజనాలను, విపరీతమైన అదృష్టాన్ని తీసుకురానుంది.
మిథున రాశి :
మిథున రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు అత్యంత శుభప్రదంగా మారనుంది. ముఖ్యంగా కళలు, క్రియేటివ్ రంగాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, సామాజిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఈ కాలంలో ఆధ్యాత్మిక మరియు మతపరమైన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ పూర్తి ఉత్సాహంతో పాల్గొని విజయం సాధిస్తారు.
సింహ రాశి :
సింహ రాశి వారికి బుధుడి గోచారం అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. వ్యాపారస్తులు అకస్మాత్తుగా ఒక పెద్ద మరియు లాభదాయకమైన ఒప్పందాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ (సంప్రదింపుల నైపుణ్యాలు) అద్భుతంగా మెరుగవుతాయి, దీనివల్ల సమాజంలో ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీ మనస్సులో సరికొత్త, వినూత్నమైన ఆలోచనలు మెరుస్తాయి.
కన్యా రాశి :
కన్యా రాశి వారికి బృహస్పతి నక్షత్రంలో బుధుడి సంచారం సకల సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పైఅధికారుల (బాస్) నుంచి… అలాగే గురువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీలోని సృజనాత్మకత ఈ కాలంలో సరికొత్త శిఖరాలకు చేరుకుంటుంది.
బుధ గ్రహ అనుగ్రహం కోసం చేయాల్సిన 3 పరిహారాలు…
బుధ సంచారం వల్ల కలిగే శుభ ప్రభావాలను మరింత పెంచుకోవడానికి మరియు జాతకంలో బుధుడి అశుభ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి జ్యోతిష్య నిపుణులు కొన్ని పరిహారాలను సూచిస్తున్నారు.
- బుధుడి అనుగ్రహం కోసం ‘ఓం బుం బుధాయ నమః’, ‘ఓం ఐం శ్రీం శ్రీం బుధాయ నమః’ లేదా ‘ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః’ అనే మంత్రాలను క్రమం తప్పకుండా జపించాలి.
- బుధవారం నాడు పేదలకు లేదా దేవాలయంలో ఆకుపచ్చని కూరగాయలు, ఆకుపచ్చని ధాన్యాలను (పెసలు వంటివి) దానం చేయడం వల్ల బుధదేవుని ఆశీస్సులు లభిస్తాయి.
- జాతకంలో బుధ దోషాలు తొలగిపోవడానికి ప్రతి బుధవారం నాడు ఆవుకు పచ్చి గడ్డి లేదా ఆకుపచ్చని మేతను తినిపించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలు మరియు పండితుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంది. దీనిని కేవలం సమాచారం కోసమే ఇస్తున్నాము. మరింత పూర్తి వివరాల కోసం సంబంధిత రంగ నిపుణులను లేదా ప్రావీణ్యం గల జ్యోతిష్యులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

