...
...
Next Story

రేపే మూడేళ్ళకు వచ్చే పరమ ఏకాదశి.. వ్రత లాభం, విధానం, మంత్రాలతో పాటు అపార ధనలాభం కోసం చేయాల్సిన 3 పరిహారాలు ఇవే

అధిక మాసంలో వచ్చే పరమ ఏకాదశి విశిష్టత, పూజా ముహూర్తం, ఉపవాస సమయాలు తెలుసుకోండి. ఈ రోజు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం చేయాల్సిన కొన్ని ప్రత్యేక పరిహారాలు మీకోసం.

Published on: Jun 10, 2026, 12:31:17 IST
Advertisement

అధికమాసం చాలా విశేషమైనది. అలాగే మన హిందూ సంప్రదాయంలో వచ్చే ప్రతి తిథికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో ఏకాదశి ఇంకా విశేషమైనదని చెప్పొచ్చు.

రేపే మూడేళ్ళకు వచ్చే పరమ ఏకాదశి.. వ్రత లాభం, విధానం, మంత్రాలతో పాటు అపార ధనలాభం కోసం చేయాల్సిన 3 పరిహారాలు ఇవే (pinterest)
రేపే మూడేళ్ళకు వచ్చే పరమ ఏకాదశి.. వ్రత లాభం, విధానం, మంత్రాలతో పాటు అపార ధనలాభం కోసం చేయాల్సిన 3 పరిహారాలు ఇవే (pinterest)

అధికమాసంలో వచ్చే ఏకాదశిని "పరమ ఏకాదశి" అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తిథి. ఈ మాసంలో శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతిని కూడా పొందవచ్చు. మహా యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుంది.

రేపే పరమ ఏకాదశి 2026

పరమ ఏకాదశి 2026 రేపు, అనగా జూన్ 11న వచ్చింది. పంచాంగం ప్రకారం జూన్ 11న తెల్లవారుజామున 12:57కి ఏకాదశి తిథి మొదలవుతుంది. అదే రోజు రాత్రి 10:30తో ముగుస్తుంది. రేపు శ్రీహరికి పూజలు చేసి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితాన్ని చూడొచ్చు. ప్రత్యేక పూజలు చేయడానికి ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు.

ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి?

జూన్ 12, శుక్రవారం నాడు ఉపవాసాన్ని విరమించాలి. వ్రతభంగం కాకుండా ఉండడానికి ఉదయం 5:23 నుంచి 8:10 లోపు ఉపవాస విరమణ పూర్తి చేయాలి. అప్పుడే వ్రతం పూర్తి ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.

ఈ వ్రతం ఎందుకు శక్తివంతమైనది?

విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" మంత్రాన్ని జపించండి.

దానాలు

పరమ ఏకాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, ఆర్థిక సహాయం వంటివి చేస్తే అక్షయ పుణ్యఫలాలను పొందడానికి వీలవుతుంది.

ఐశ్వర్యం కలగాలంటే ఈ పరిహారాలను పాటించండి

11 గవ్వలు

పూజ చేసేటప్పుడు 11 గవ్వలు లేదా నాణేలను పసుపు వస్త్రంలో చుట్టి దేవుడి పీఠం దగ్గర పెట్టండి. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఆ మూటను డబ్బులు దాచుకునే చోట భద్రపరచండి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.

లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి

మఖానా లేదా సగ్గుబియ్యంతో ఖీర్ చేసి లక్ష్మీదేవికి సమర్పించండి. నైవేద్యం పెట్టాక కుటుంబ సభ్యులందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టండి.

తులసి కోట దగ్గర నెయ్యి దీపం

ఈ పవిత్రమైన ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీనారాయణులను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఇలా చేస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe