ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొడుకులు పుట్టాలనుకునే వారికి ఈ ఏకాదశి చాలా మంచి రోజు. ఆ రోజున సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే పుత్రుడు కలిగే అవకాశం ఉంది. సనాతన సంప్రదాయం ప్రకారం నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
ఈ సంవత్సరంలో రెండు సార్లు పుత్రదా ఏకాదశి

హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, ఈ పుత్రదా ఏకాదశి ఏడాదికి రెండుసార్లు వస్తుంది. పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని పుష్య పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు గురించి వివరంగా తెలుసుకుందాం.
శ్రావణ పుత్రదా ఏకాదశి 2026
శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న వచ్చింది. ఆగస్టు 24న వ్రత విరమణ చేయాలి. పుత్రదా ఏకాదశి నాడు ఈ పనులు చేయడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. పుత్రదా ఏకాదశి నాడు ఈ తప్పులు చెయ్యకూడదు.. దాంతో అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
1.పెద్దలను అవమానించకూడదు
పుత్రదా ఏకాదశి నాడు ఇంట్లో ఉండే పెద్దవారిని అవమానించకూడదు. వారిపట్ల చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు.
2.ధాన్యాలను తీసుకోకూడదు
మత గ్రంథాల ప్రకారం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి ధాన్యాలను కూడా తీసుకోకూడదు. అలా చేయడం వలన వ్రత సంపూర్ణ ఫలితాలు దక్కవు.
3.అన్నం తినకూడదు
పుత్రదా ఏకాదశి నాడు వండిన అన్నాన్ని తినడం మంచిది కాదు. కాబట్టి ఉపవాసం చేసేవారు అన్నానికి దూరంగా ఉండాలి.
4.మాంసాహారం, తామసిక ఆహారం
{{/usCountry}}పుత్రదా ఏకాదశి నాడు వండిన అన్నాన్ని తినడం మంచిది కాదు. కాబట్టి ఉపవాసం చేసేవారు అన్నానికి దూరంగా ఉండాలి.
4.మాంసాహారం, తామసిక ఆహారం
{{/usCountry}}శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు మాంసాహారం, మద్యం, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. వ్రతం ద్వారా లభించే శుభ ఫలితాలు తగ్గుతాయి.
5.పగలు నిద్రపోకూడదు
ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్లు పగలు నిద్రపోవడం మంచిది కాదు. అలాగే ఎవరినీ దూషించకూడదు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా మంచిది కాదు.
పుత్రదా ఏకాదశి వ్రత నియమాలు
శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని నిర్జలంగా, నీటిని తీసుకుంటూ, పండ్లు తింటూ, సైంధవ లవణం తీసుకుంటూ ఆచరించాలి. అలాగే ఆరోజు అబద్ధాలు చెప్పడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులను విమర్శించడం వంటివి చేయకూడదు.
విష్ణువుని ఆరాధించండి
శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు విష్ణువు పూజలో పసుపు రంగు పూలు, పసుపు రంగు పండ్లు, తులసి దళాలు కచ్చితంగా ఉపయోగించాలి.
వ్రత విరమణ
ద్వాదశి రోజున వ్రత విరమణ చేయాలి. ఆ రోజు సూర్యోదయం తర్వాత బ్రాహ్మణులకు భక్తితో భోజనం పెట్టాలి. దక్షిణ లేదా దానధర్మాలు సమర్పించాలి. ఇలా వ్రతాన్ని విరమించాలి. పంచాంగం ప్రకారం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఉదయం 5:24కి విరమించడం శుభప్రదం.