హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వైశాఖ మాసంలో వచ్చే 'మోహినీ ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. దుష్టశక్తుల నుంచి లోకాన్ని కాపాడి, దేవతలకు అమృతాన్ని అందించడానికి శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం ధరించిన రోజే ఈ మోహినీ ఏకాదశి. ఈ ఏడాది ఏప్రిల్ 27న భక్తులు ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకోనున్నారు.
వైశాఖ మాసం : శ్రీమహావిష్ణువు మోహినీ రూపం ధరించిన ఈ పవిత్రమైన రోజున పూజా విధానం ఇదే
అమృత మథనం.. మోహినీ అవతారం

స్కంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం.. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతం కోసం దేవతలు, అసురుల మధ్య పెద్ద పోరాటమే జరిగింది. రాక్షసులు అమృతాన్ని దక్కించుకుంటే లోకానికి ముప్పు వాటిల్లుతుందని భావించిన విష్ణుమూర్తి, మోహినీ అనే అత్యంత సౌందర్యవతి రూపంలో ప్రత్యక్షమయ్యారు.
తన మాయాజాలంతో రాక్షసులను మైమరపించి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచారు. ఈ క్రమంలోనే స్వర్భానుడు అనే రాక్షసుడు వేషం మార్చుకుని అమృతాన్ని సేవించగా, సూర్య చంద్రులు అతడిని గుర్తించారు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడిని ఖండించారు. వారే నేడు మనం పిలుచుకునే రాహువు మరియు కేతువు. విష్ణుమూర్తి ఈ మోహినీ అవతారాన్ని ధరించిన తిథి ఏకాదశి కావడంతో దీనికి 'మోహినీ ఏకాదశి' అనే పేరు స్థిరపడింది.
యుగయుగాల నాటి విశిష్టత
ఈ వ్రతం ప్రాశస్త్యం గురించి పురాణాల్లో ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. సత్యయుగంలో కౌటిన్య ముని ఒక వేటగాడికి ఈ వ్రతం గురించి వివరించి, అతని పాపాల నుంచి విముక్తి కలిగించారని చెబుతారు. త్రేతాయుగంలో సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి ఈ వ్రత మహత్యాన్ని వివరించారు. ఇక ద్వాపర యుగంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ మోహినీ ఏకాదశి గొప్పతనాన్ని వివరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వేల ఏళ్ల తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.
మోహినీ ఏకాదశి పూజా విధానం
ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకునే వారు కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. అవేంటో కూడా తెలుసుకుందాం..
{{/usCountry}}ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకునే వారు కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. అవేంటో కూడా తెలుసుకుందాం..
{{/usCountry}}అభ్యంగన స్నానం: ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానాదులు ముగించుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
సంకల్పం: దేవుని గదిని శుభ్రం చేసి, శ్రీమహావిష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. నెయ్యితో దీపారాధన చేసి, వ్రతాన్ని నిష్ఠతో చేస్తానని సంకల్పం చెప్పుకోవాలి.
షోడశోపచార పూజ: విష్ణుమూర్తికి చందనం, పసుపు, కుంకుమ సమర్పించాలి. విగ్రహానికి పంచామృతాలు, నీటితో అభిషేకం చేయడం విశేష ఫలితాలనిస్తుంది.
నైవేద్యం: విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు, పసుపు రంగు పూలతో పూజించాలి. పండ్లు, నైవేద్యం సమర్పించాలి.
పారాయణం: ఈ రోజున 'విష్ణు సహస్రనామ స్తోత్రం' పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
జాగరణ: ఏకాదశి నాటి రాత్రి భజనలు, కీర్తనలతో జాగరణ చేయడం వల్ల అపరిమితమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల గోదానం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. తెలియక చేసిన పాపాలు సైతం ఈ వ్రత ప్రభావంతో తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. మోహినీ ఏకాదశి 2026లో ఎప్పుడు వచ్చింది?
2026లో మోహినీ ఏకాదశి ఏప్రిల్ 27, సోమవారం నాడు వచ్చింది.
2. వ్రతం చేసేటప్పుడు ఏం తినాలి?
సాధారణంగా ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండటం ఉత్తమం. సాధ్యపడని వారు పండ్లు, పాలు లేదా అల్పహారం తీసుకోవచ్చు. అయితే అన్నం మాత్రం అస్సలు తీసుకోకూడదు.
3. ఈ వ్రతం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి?
ఈ వ్రతం వల్ల మనిషి చేసిన పాపాలు నశిస్తాయి. మానసిక ప్రశాంతత కలగడంతో పాటు మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.