ఈ ఏడాది సెప్టెంబర్ 14న ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభంకానున్నాయి. అమృత, సర్వార్థ సిద్ధి యోగాల కలయికతో వస్తున్న ఈ పర్వదినాన గణపతిని ఏ సమయంలో ప్రతిష్టించాలి? పూజా విధానం ఎలా ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

హిందువుల అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో వినాయక చవితి ముందుంటుంది. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి రోజున విఘ్నేశుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పర్వదినం వచ్చింది. సోమవారం రోజున ఈ పండుగ రావడంతో పాటు అమృత యోగం, సర్వార్థ సిద్ధి యోగం తోడుకావడం విశేషం. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజే ఆయన కుమారుడైన గణనాథుడి పూజలు ప్రారంభంకానుండటంతో ఈసారి పండుగ ప్రాధాన్యత మరింత సంతరించుకుంది.
గణపతి పూజకు అత్యంత శుభ ముహూర్తం ఇదే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భాద్రపద శుక్ల చతుర్థి తిథి సెప్టెంబర్ 14న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. పురాణాల ప్రకారం స్వామివారు మధ్యాహ్న సమయంలో జన్మించారని నమ్ముతారు. అందుకే మధ్యాహ్న సమయంలోనే విగ్రహ ప్రతిష్టాపన చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 14న ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించడానికి అత్యంత అనుకూలమైన సమయం.
విగ్రహ ప్రతిష్టాపన విధానం మరియు దిశ
ఇంట్లో లేదా పూజా మందిరంలో ఈశాన్య మూల లేదా తూర్పు దిశలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేయడం శ్రేయస్కరం.
{{/usCountry}}ఇంట్లో లేదా పూజా మందిరంలో ఈశాన్య మూల లేదా తూర్పు దిశలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేయడం శ్రేయస్కరం.
{{/usCountry}}పీఠంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి మట్టితో చేసిన విగ్రహాన్ని ఉంచాలి.
స్వామివారికి 21 గరిక పోచలు, మందార పూలు, సింధూరం, అక్షతలు, జనేవు సమర్పించాలి.
నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను ఉంచడం ద్వారా స్వామివారి విశేష అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
వినాయక చవితి రోజు రాత్రి సమయంలో చంద్ర దర్శనం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఆ రోజు చంద్రుడిని చూస్తే అవాంఛిత నిందలు వచ్చే అవకాశం ఉందని పౌరాణిక విశ్వాసం.
ఉత్సవాలు మరియు నిమజ్జనం
వినాయక చవితితోనే దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. భక్తులు తమ స్థానిక ఆచారాలను బట్టి తొమ్మిది రోజుల పాటు లేదా పదహారు రోజుల పాటు స్వామి వారిని పూజిస్తారు. పది రోజుల పాటు సాగే ఈ గణేశ ఉత్సవాలు సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రోజున ఘనంగా జరిగే నిమజ్జనంతో ముగుస్తాయి.