...
...
Next Story

శని జయంతి 2026 - సాయంత్రం వేళ దోష నివారణకు చేయాల్సిన పరిహారాలు

Shani Jayanti Remedies 2026:శని జయంతి రోజున కర్మ ప్రదాత అయిన శని దేవుడిని అనుగ్రహం కోసం చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి. జాతకంలో ఏల్నాటి శని, అర్ధాష్టమ శని లేదా శని దోషాల తీవ్రతను తగ్గించుకునేందుకు సాయంత్రం వేళ చేయాల్సిన పరిహారాలు, నియమాలను పూర్తి కథనంలో తెలుసుకోండి.

Published on: May 16, 2026, 13:13:40 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

Shani Jayanti Remedies 2026: హిందూ సంప్రదాయంలో శని జయంతికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ ఫలదాలత… న్యాయాధిపతి అయిన శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజును అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది శని జయంతి పవిత్రమైన అమావాస్య తిథితో కలిసి రావడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.

శని జయంతి 2026
శని జయంతి 2026

జాతకంలో శని దోషాలు ఉన్నవారు, ముఖ్యంగా ఏల్నాటి శని (సడే సతి) లేదా శని ధైయాతో బాధపడుతున్న వారు ఈ రోజున భక్తితో చేసే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా పెద్ద సంక్షోభాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని దేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గించి… ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు సాయంత్రం వేళ చేయాల్సిన ముఖ్యమైన నివారణలు, పాటించాల్సిన నియమాలను ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

శని దోష నివారణకు అద్భుత పరిహారాలు

రావి చెట్టు పూజ : శని దేవునికి రావి చెట్టు అంటే ఎంతో ప్రీతికరం. శని జయంతి సాయంత్రం సమయంలో రావి చెట్టు వద్దకు వెళ్లి ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపంలో ఒకటి లేదా రెండు నల్ల నువ్వులను వేయడం మంచిది. దీపం వెలిగించిన తర్వాత, రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంత సేపూ మనస్సులో 'ఓం శ్యామ్ శనిశ్చరాయ్ నమః' అనే మంత్రాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి.

తైలాభిషేకం - ఛాయా దానం : శని దేవుని విగ్రహానికి లేదా శిలకు ఆవ నూనెతో అభిషేకం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అయితే, నూనెను సమర్పించడానికి ముందు ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని, అందులో మీ ముఖాన్ని (నీడను) చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనెను శని దేవుడికి సమర్పించాలి లేదా ఆలయంలో దానం చేయాలి. దీనినే 'ఛాయా దానం' (షాడో డొనేషన్) అంటారు. దీనివల్ల దీర్ఘకాలిక శారీరక బాధలు తొలగిపోతాయి.

మంత్ర జపం : మీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా… మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా లేదా చేపట్టిన పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా ఈ పరిహారం చేయాలి. శని జయంతి రోజున రుద్రాక్ష మాలను పట్టుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని లేదా శని బీజ మంత్రమైన 'ఓం ప్రాం ప్రీం ప్రూం సహ్ శనిశ్చారాయ నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల అపారమైన శాంతి లభిస్తుంది.

నిస్సహాయులకు సేవలందించడం : శని దేవుడు న్యాయానికి ప్రతిరూపం. ఆయన ఎల్లప్పుడూ పేదలు, నిస్సహాయులు మరియు కష్టపడి పనిచేసే శ్రామికులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ పవిత్రమైన రోజున పారిశుధ్య కార్మికులకు లేదా పేదలకు నల్లటి బట్టలు, బూట్లు, చెప్పులు, గొడుగు లేదా మినపప్పుతో చేసిన ఖిచిడీని దానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వల్ల శని దేవుడు త్వరగా ప్రసన్నుడవుతాడు.

జీవ కారుణ్యం : పక్షులు మరియు జంతువులకు సేవ చేయడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది. ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ధాన్యపు గింజలు లేదా రొట్టె ముక్కలను ఉంచాలి. శని జయంతి నాడు నల్ల కుక్కకు ఆవ నూనె రాసిన రోటీని తినిపించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అలాగే పెద్ద చెట్ల వేర్ల దగ్గర చీమల కోసం గోధుమ పిండి, పంచదార కలిపిన మిశ్రమాన్ని చల్లాలి.

ఈ పనులు చేయకండి…

  • కళ్లల్లోకి చూడవద్దు : శని ఆలయానికి వెళ్లి పూజలు చేసే సమయంలో, ఎప్పుడూ శని దేవుని విగ్రహం యొక్క కళ్లల్లోకి నేరుగా చూడకూడదు. శని దేవుని దృష్టి నేరుగా మనపై పడకుండా ఎల్లప్పుడూ ఆయన పాదాలను మాత్రమే చూస్తూ నమస్కరించుకోవాలి.
  • ఇంటికి ఇవి తీసుకురావద్దు : శని జయంతి రోజున మార్కెట్ నుంచి ఇనుము, ఆవ నూనె, ఉప్పు, నల్ల నువ్వులు లేదా తోలుతో చేసిన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. ఈ రోజున వీటిని దానం చేయడం చాలా మంచిది, కానీ సొంతానికి కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు.
  • వారిని హింసించవద్దు : శని దేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఈ రోజున పేదలను, వృద్ధులను, శ్రామికులను లేదా నోరులేని మూగజీవాలను హింసించడం గానీ, అవమానించడం గానీ చేయకూడదు. వారిని గౌరవించి తోచిన సహాయం చేయడం వల్ల శని దేవుని ఆశీస్సులు లభిస్తాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks