...
...
Next Story

రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు - ఈ 4 రాశులపై ప్రత్యేక అనుగ్రహం, అక్టోబర్ వరకు శుభ పరిణామాలు

Shani Revati Nakshatra Gochar 2026 : శనిదేవుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడంతో పాటు వృషభరాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడింది. ఈ అరుదైన జ్యోతిష్య మార్పుల వల్ల వృషభం, తులా, మకరం, కుంభ రాశుల వారికి అక్టోబర్ 9, 2026 వరకు అపారమైన ధనలాభం, కెరీర్ పురోగతి లభించనున్నాయి.

Published on: May 18, 2026, 06:50:33 IST
Advertisement

Shani Revati Nakshatra Gochar 2026 : జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కర్మఫల దాతగా, న్యాయాధికారిగా భావిస్తారు. మనుషులు చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే శని గ్రహం యొక్క కదలికల్లో స్వల్ప మార్పు వచ్చినా…. దాని ప్రభావం మానవాళిపై తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం శనిదేవుడు తన నక్షత్రరాశిని మార్చాడు. ఇప్పటివరకు ఉత్తరభద్రపద నక్షత్రంలో ఉన్న శని, ఇప్పుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శనిదేవుడు అక్టోబర్ 9, 2026 వరకు కొలువై ఉంటాడు. దాదాపు ఐదు నెలల పాటు శనిదేవుడి అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా ఉండబోతోంది.

రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు
రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు

నవగ్రహాలలో శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి లేదా నక్షత్ర సంచారానికి శనికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే శని ప్రభావం జీవితంలో దీర్ఘకాలం పాటు ఉంటుంది. అయితే ఈసారి జరిగిన రేవతి నక్షత్ర ప్రవేశం మరింత ప్రత్యేకమైనదిగా మారింది. ఎందుకంటే ఇదే సమయంలో వృషభరాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడి కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన 'త్రిగ్రహి యోగం' ఏర్పడింది. ఒకవైపు శని నక్షత్ర మార్పు, మరోవైపు త్రిగ్రహి యోగం తోడుకావడంతో ఈ సమయం జ్యోతిష్య పరంగా అత్యంత అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఈ శుభ పరిణామాల వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం వరించబోతోంది.

వృషభ రాశి : ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం

వృషభ రాశి వారికి ఈ కాలం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం మునుపటి కంటే రెట్టింపు అవుతుంది. సొంతంగా సరైన నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో లాభాలు గడిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం.

తులా రాశి : ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెంపు

మకర రాశి వారి జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న కష్టాలు, ఇబ్బందులు ముగిసే సమయం ఆసన్నమైంది. మానసిక ఒత్తిడి మునుపటి కంటే చాలా వరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు పాత బాకీలు తీరిపోతాయి. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే కొత్త ప్రణాళికలు, వ్యాపార వ్యూహాలు విజయవంతంగా అమలువుతాయి. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అటు వృత్తిపరమైన బాధ్యతలను, ఇటు కుటుంబాన్ని సమతుల్యం (బ్యాలెన్స్) చేసుకోవడం మీకు సులువవుతుంది.

కుంభ రాశి : అప్పుల బాధల నుంచి విముక్తి

కుంభ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ధనలాభం కలగడం వల్ల అప్పులు లేదా రుణాల భారం క్రమంగా తగ్గుతుంది. ఎక్కడైనా నిలిచిపోయిన లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాల బాట పడతారు. కుటుంబ వాతావరణం మునుపటి కంటే ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. బంధుత్వాలు, కుటుంబ సభ్యుల మధ్య సడలిన బంధాలు మళ్లీ బలపడతాయి. ఇంట్లోని వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల మనసు తేలికపడుతుంది.

కొన్ని రాశిచక్రాలపై శని దేవుడి శుభ ప్రభావం బలంగా ఉన్నప్పటికీ… ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలైనా తొందరపాటుతో తీసుకోకూడదు. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. వివేకంతో, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మరింత ఆర్థిక లాభాలను, వృత్తిపరమైన విజయాలను అందిస్తాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe