భరణి నక్షత్రంలోకి బుధుడు - ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం, ఊహించని ధనలాభం..!
Mercury Transit in Bharani 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యువరాజు బుధుడు తన నడకను మార్చుకున్నాడు. శుక్రుడి నక్షత్రమైన భరణిలోకి బుధుడు ప్రవేశించడంతో మే 13 వరకు నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్ పురోగతి కలగనుంది.
Mercury Transit in Bharani 2026 : నవగ్రహాలలో బుద్ధికి, వ్యాపారానికి, వాక్కుకు కారకుడైన బుధ గ్రహం తన స్థానాన్ని మార్చుకుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం…. బుధుడు 2026 మే 7వ తేదీన భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు, శుక్రుడు పరమ మిత్రులు.

మిత్రుడి నక్షత్రంలోకి బుధుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగ కాలం మొదలైంది. మే 13వ తేదీ ఉదయం వరకు బుధుడు ఇదే నక్షత్రంలో కొలువై ఉంటాడు. ఈ కొద్ది రోజుల సమయంలోనే బుధ-శుక్రుల అనుగ్రహంతో ఏయే రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా లాభపడనున్నారో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి: పెరగనున్న ఆత్మవిశ్వాసం
భరణి నక్షత్రం మేష రాశి పరిధిలోకి వస్తుంది కాబట్టి…. ఈ సంచారం వల్ల మేష రాశి వారికి అత్యంత సానుకూల ఫలితాలు దక్కుతాయి. వీరి వ్యక్తిత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన శక్తి, ప్రేరణ ఈ సమయంలో లభిస్తాయి. ముఖ్యంగా కళలు, రచనలు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
మిథున రాశి: వ్యాపారంలో కొత్త ఒప్పందాలు
బుధుడు మిథున రాశికి అధిపతి కావడం వల్ల, ఈ నక్షత్ర సంచారం వీరికి సువర్ణావకాశాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు ఖరారు చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీ మాట తీరు ఇతరులను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల వృత్తి జీవితంలో పైచేయి సాధిస్తారు. మీ ప్రసంగ చాతుర్యం పెరగడం వల్ల క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు పొందే సూచనలు బలంగా ఉన్నాయి.
కన్యా రాశి: ఆర్థిక పురోగతికి మార్గం సుగమం
కన్యా రాశి వారికి బుధ సంచారం కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది. ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో కష్టపడి పనిచేయడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా, పదోన్నతి లేదా వేతనం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలు సఫలమవ్వడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు కూడా ఇది అనుకూల సమయం.
ధనుస్సు రాశి: కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి
ధనుస్సు రాశి వారికి ఈ సంచారం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పదునుగా మారుతుంది. సమస్యలను ఎదుర్కోవడంలో మీరు చూపే ధైర్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు, పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి.
భరణి నక్షత్రం స్వభావం కొంచెం ఉద్వేగంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో తొందరపడి మాట్లాడటం లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మాట తూలితే ఇబ్బందులు తప్పవు, కాబట్టి ఆలోచించి వ్యవహరించాలి.
బుధ గ్రహ దోషాలు తొలగి, శుభ ఫలితాలు పెరగాలంటే బుధవారం నాడు వినాయకుడిని ఆరాధించాలి. గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. అలాగే ఆవులకు ఆకుపచ్చని మేత తినిపించడం వల్ల జాతకంలో బుధుడి స్థానం బలపడి ఆర్థికంగా మేలు జరుగుతుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్ర పండితులు, గ్రంథాల ఆధారంగా ఈ కథనం ఇవ్వటం జరిగింది. ఆయా రంగంలోని నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

