హిందూ ధర్మ శాస్త్రాల్లో జాతకానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. గ్రహాల స్థితిగతులను చూసి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను మనం ముందే గుర్తించచ్చు. అలాగే వాటికి తగిన శాంతులు కూడా చేయించుకోవచ్చు. అయితే అందరికీ జాతక చక్రం అందుబాటులో ఉండకపోవచ్చు. పుట్టిన సమయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.

జాతక పత్రం లేకపోయినా, పుట్టిన సమయం సరిగ్గా తెలియకపోయినా సమస్యలను పరిష్కరించుకోవడం సులభమే. ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. పురాణాలు, జ్యోతిష్య నిపుణులు అలాంటి వారి కోసం కూడా కొన్ని అద్భుతమైన పరిహారాలు సూచించారు. వీటిని పూర్తి విశ్వాసంతో పాటించినట్లయితే భగవంతుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. మరి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ సమస్య ఏదైనా పరిష్కారం ఇదిగో.. జాతకం లేకపోయినా పరవాలేదు
1.ఆరోగ్యం, మానసిక ప్రశాంతత
ఆరోగ్యం బాగుండడానికి, మానసిక ప్రశాంతత కలగడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు ఉంటే ఏమైనా చేయొచ్చు. జాతకంతో సంబంధం లేదు. ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆయురారోగ్యాలు కలుగుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది.
పనుల్లో విజయాన్ని కూడా పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మనసులో భయాలు ఉన్నట్లయితే 108 సార్లు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. దీంతో అకాల మృత్యు భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఆనందంగా ఉండొచ్చు.
2.ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి బయటపడాలనుకుంటున్నట్లయితే మీ జాతకంతో సంబంధం లేదు. 41 రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మంచి ఫలితాలను చూడొచ్చు. అప్పుల బాధ నుంచి బయటపడడానికి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 41 రోజులు జపిస్తూ నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచిది. రోజూ శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడం వలన ధన వృద్ధి కలుగుతుంది. మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలను చూడొచ్చు.
3.గ్రహ దోషాల నుంచి బయట పడడానికి ఈ చిన్న పరిహారాలను పాటించండి
గ్రహ ప్రభావం వలన కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయని చాలామంది భయపడతారు. ఆ భయం కూడా మీలో ఉంటే ఈ శాంతులను పాటిస్తే మంచిది.
- చంద్ర శాంతి
గ్రహ ప్రభావం వలన కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయని చాలామంది భయపడతారు. ఆ భయం కూడా మీలో ఉంటే ఈ శాంతులను పాటిస్తే మంచిది.
- చంద్ర శాంతి
మనశ్శాంతి పొందడానికి సోమవారం నాడు శివాభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలను చూడచ్చు.
- రాహువు, కేతువు దోషాలు
రాహు శాంతి కోసం దుర్గాదేవిని ఆరాధించండి. లలితా సహస్రనామ పారాయణం చేయండి.
కేతు శాంతి కోసం గణపతి పూజ లేదా వినాయక వ్రతం చేయడం వలన విశేషమైన ఫలితాలను చూడవచ్చు. అద్భుతమైన మార్పులు వస్తాయి.
- శని దోషం
శని దోషం నుంచి బయట పడడానికి హనుమంతుని ఆలయంలో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాను చదువుకోండి.
4.విజయాలు కలగడానికి
పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి, విజయాలను పొందడానికి గణపతి అధర్వశీర్షం పారాయణం చేస్తే చక్కటి ఫలితాలను చూడొచ్చు. అద్భుతమైన మార్పులు వస్తాయి.
5.వివాహం, సంతాన సమస్యలు
సకాలంలో పెళ్లి అవ్వాలన్నా, సంతాన సమస్యలతో సతమతమవుతున్నా ఈ ప్రత్యేక పూజలు అద్భుతంగా పని చేస్తాయి. వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే రుక్మిణి కళ్యాణాన్ని పారాయణం చేయండి. లేకపోతే 41 రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే కూడా మంచి సంబంధం వస్తుంది.
సంతాన సమస్యలు ఉన్నట్లయితే కాళహస్తిలో సర్పదోష నివారణ పూజ చేయించండి. లేదా సంతాన గోపాలకృష్ణ వ్రతం చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. ఆనందంగా ఉండొచ్చు. ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు.
అయితే ఏ పూజ చేసినా, ఏ మంత్రాన్ని పఠించినా భక్తి, ఏకాగ్రత చాలా అవసరం. జాతకం లేదని చింతించకండి. ఈ పరిహారాలను శ్రద్ధతో పాటించండి. కచ్చితంగా మార్పు కనబడుతుంది. నమ్మకమే విజయానికి పునాది అని గుర్తుపెట్టుకుని ఆచరించండి.