పేరులోని మొదటి అక్షరం చెప్పే సీక్రెట్.. మీ పేరు దేనితో మెుదలవుతుంది?

ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. అలాగే వారి పేరులోని మొదటి అక్షరాలు వారి గుణగణాలు, భవిష్యత్తు, ఆర్థిక స్థితి, పురోగతిపై ప్రభావం చూపుతాయని అంటారు.

Updated on: May 20, 2026, 19:49:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా కొన్ని నిర్దిష్ట అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులను అదృష్టవంతులుగా భావిస్తారు. కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చిన్న వయస్సులోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి, జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారని కూడా నమ్ముతారు. కింద చెప్పే మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తి సంపన్నమైన జీవితాన్ని గడుపుతారని అంటారు. ఇప్పుడు ఆ మూడు అక్షరాలు ఏంటో, ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి లక్షణాలు ఏమిటో చూద్దాం..

పేరులోని మొదటి అక్షరం చెప్పే సీక్రెట్
పేరులోని మొదటి అక్షరం చెప్పే సీక్రెట్

'ఆర్' అనే అక్షరాన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు తాము వెళ్ళే ప్రతిచోటా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటారు. వారి మాటతీరు కూడా ఇతరులను ఆకట్టుకుంటుంది. ఏదైనా ప్రణాళిక వేసి సాధించగల సామర్థ్యం ఉండటం వల్ల వారు జీవితంలో వేగంగా పురోగమిస్తారు. తమ వృత్తిలో ఎంతటి రిస్క్ తీసుకున్నప్పటికీ, వారు అందులో మంచి విజయాన్ని సాధిస్తారు. చేతుల్లో చాలా డబ్బు పోగుపడుతుంది. డబ్బు సంపాదించే మార్గాలు వారికి బాగా తెలిసి ఉంటాయి. కొంతమందికి విదేశాలలో పనిచేసే అవకాశాలు లభిస్తాయి.

'ఎస్' అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు, నాయకత్వ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వారికి చిన్న వయస్సులోనే డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ఏదైనా గొప్పది సాధించాలనే బలమైన కోరిక వారికి ఉంటుంది. వారు ఏ వ్యాపారం చేసినా, అందులో గొప్ప విజయాన్ని సాధిస్తారు. న్యూమరాలజీ ప్రకారం.. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఇల్లు, కారుతో పాటు రాజరిక జీవితాన్ని గడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

'ఎమ్' అనే అక్షరం బాధ్యత, సంపద, పురోగతికి ప్రతీకగా చెబుతారు. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు డబ్బును సమర్థవంతంగా పొదుపు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ డబ్బు సంపాదించే సామర్థ్యం కంటే.. మంచి రాబడి కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడంలో వారు ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటారు. దీని కారణంగా జీవితంలో క్రమంగా పురోగమించి సంపన్నులు అవుతారు. ఎం అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు మధ్య తమ జీవితంలో ఒక ప్రధాన మలుపును అనుభవిస్తారని, జీవితంలో ఊహించని ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అంటారు.

ఒకరి పేరులోని మొదటి అక్షరం వారి జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నా.. వాస్తవానికి జీవితంలో విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కృషి, ప్రతిభ అవసరం. ఈ రెండూ మీకు ఉండి, జీవితంలో లభించే అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే.. మీ పురోగతిని ఎవరూ ఆపలేరు.

గమనిక : ఇక్కడ అందించిన కథనం అంచనాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More