హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి నెలా కృష్ణ పక్షం, శుక్ల పక్షాల్లో వచ్చే త్రయోదశి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని అర్ధనారీశ్వర రూపంలో ఆరాధించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ప్రదోష కాలంలో చేసే పూజకు అనంతమైన ఫలితం లభిస్తుంది. మే నెలలో వచ్చే మొదటి ప్రదోష వ్రతం గురువారంతో కలిసి రావడంతో దీనికి మరింత ప్రాముఖ్యత చేకూరింది.
ముహూర్తం ఎప్పుడు?

పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి మే 14న ఉదయం 11:21 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 15న ఉదయం 8:32 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం, ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో త్రయోదశి తిథి ఎప్పుడు ఉంటుందో, ఆ రోజే వ్రతాన్ని ఆచరించాలి. ఈ లెక్కన మే 14వ తేదీ సాయంత్రం త్రయోదశి తిథి ఉన్నందున, ఆ రోజే 'గురు ప్రదోష వ్రతం' జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
గురు ప్రదోష వ్రత విశిష్టత
గురువారంతో కూడిన ప్రదోషాన్ని గురు ప్రదోషం అంటారు. ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం (బృహస్పతి) బలహీనంగా ఉంటుందో, వారు ఈ రోజున శివారాధన చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధించాలన్నా, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా ఈ వ్రతం ఒక అద్భుతమైన మార్గం. "ఈ రోజున భక్తితో శివుడిని పూజిస్తే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, సంకల్ప బలం పెరుగుతుంది," అని ఆధ్యాత్మిక నిపుణులు వివరిస్తున్నారు.
పూజా విధానం
- ప్రదోష వ్రతం ఆచరించే వారు కొన్ని కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది.
- ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని శివుడిని స్మరిస్తూ వ్రత సంకల్పం చేసుకోవాలి.
- రోజంతా ఉపవాసం ఉండటం ఉత్తమం. సాధ్యం కాని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.
- ఈ సమయంలో కోపం, ద్వేషం, ఇతరులపై విమర్శలు వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
- సూర్యాస్తమయానికి ఒక గంట ముందు మళ్లీ స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి.
- పూజా స్థలాన్ని గంగాజలం లేదా గోమూత్రంతో శుద్ధి చేసి, మండపాన్ని అలంకరించుకోవాలి.
- పూజలో కూర్చునేటప్పుడు దర్భాసనం లేదా ఉన్ని దుప్పటిపై కూర్చుంటే పూజా ఫలం సంపూర్ణంగా లభిస్తుంది.
పూజా ముహూర్తం: మే 14 సాయంత్రం 5:22 గంటల నుంచి రాత్రి 7:04 గంటల వరకు శివ పూజకు అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో శివలింగానికి బిల్వపత్రాలతో పూజ చేసి, దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది.
ఆహార నియమాలు
- ప్రదోష వ్రతం రోజున ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- సాయంత్రం ప్రదోష కాలంలో శివుడిని దర్శించుకుని, పూజ పూర్తి చేసిన తర్వాతే ఫలాహారం స్వీకరించడం ఆచారం.
- ఈ నియమాలను నిష్ఠతో పాటిస్తే శివయ్య అనుగ్రహంతో పాటు జాతకంలోని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
పూజా ముహూర్తం: మే 14 సాయంత్రం 5:22 గంటల నుంచి రాత్రి 7:04 గంటల వరకు శివ పూజకు అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో శివలింగానికి బిల్వపత్రాలతో పూజ చేసి, దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది.
ఆహార నియమాలు
- ప్రదోష వ్రతం రోజున ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- సాయంత్రం ప్రదోష కాలంలో శివుడిని దర్శించుకుని, పూజ పూర్తి చేసిన తర్వాతే ఫలాహారం స్వీకరించడం ఆచారం.
- ఈ నియమాలను నిష్ఠతో పాటిస్తే శివయ్య అనుగ్రహంతో పాటు జాతకంలోని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
నిరాకరణ: పైన పేర్కొన్న అంశాలు మతపరమైన విశ్వాసాలు, పండితుల అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత విశ్వాసాలు, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోగలరు.