ఈరోజు అపర ఏకాదశి వేళ విష్ణుమూర్తికి ఈ 5 నైవేద్యాలు పెడితే అదృష్టం మీదే.. వివాహ, సంతాన సమస్యలు కూడా తొలగిపోవచ్చు!
ఈరోజు అపర ఏకాదశి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు, సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ ఏకాదశి ఒక వరం లాంటిదని పండితులు వివరిస్తున్నారు. ఈ పవిత్ర రోజున శ్రీమహావిష్ణువుకు ఐదు రకాల ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వల్ల వివాహ, సంతాన సమస్యలు తొలగిపోతాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చదవండి.
వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' లేదా 'అచల ఏకాదశి' అని పిలుస్తారు. సనాతన ధర్మంలో ఈ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. 2026 సంవత్సరంలో మే 13వ తేదీ బుధవారం నాడు ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.

అపర ఏకాదశి ప్రాముఖ్యత
"అపర" అంటే అపారమైన అని అర్థం. ఈ రోజున చేసే ఉపవాసం, పూజ వల్ల భక్తులకు అనంతమైన సంపద, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. జీవితంలో తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోయి, మోక్ష మార్గం సుగమమవుతుంది. కేవలం పూజ మాత్రమే కాదు, స్వామివారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
విష్ణుమూర్తిని ప్రసన్నం చేసే 5 ప్రత్యేక నైవేద్యాలు
1. పంచామృతం:
శ్రీమహావిష్ణువుకు పంచామృతం అంటే అత్యంత ప్రీతి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది సానుకూల శక్తికి ప్రతీక. ఏకాదశి రోజున స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయడం లేదా నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి.
2. బెల్లం:
బెల్లాన్ని నైవేద్యంగా పెడితే జీవితంలో తీపి పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా, వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలను తగ్గించి, అన్యోన్యతను పెంచుతుంది.
3. ఎండు ద్రాక్ష, మఖానా:
డ్రై ఫ్రూట్స్, మఖానాను నైవేద్యంగా పెట్టడం వల్ల ధనధాన్యాలు సమకూరుతాయి. ఇవి ఐశ్వర్యానికి సూచికలు. ఈ పదార్థాలను నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రసాదంగా పంపిణీ చేస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
4. కేసరి భాత్:
విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే మహా ప్రాణం. అందుకే పసుపు, కుంకుమపువ్వు, నెయ్యితో కేసరి భాత్ చేసిన సమర్పించడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారం పాటించడం వల్ల త్వరగా శుభవార్త వింటారు.
5. అరటిపండు:
సంతాన సంబంధిత సమస్యలతో బాధపడేవారు అపర ఏకాదశి రోజున అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించి, ఆపై పేదలకు దానం చేయాలి. దీనివల్ల విష్ణుమూర్తి ప్రత్యేక కృప లభిస్తుందని, సంతాన యోగం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
పూజా నియమాలు
- ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి వ్రత సంకల్పాన్ని తీసుకోవాలి.
- విష్ణుమూర్తి లేదా శాలిగ్రామం ముందు దీపం వెలిగించి, పైన చెప్పిన నైవేద్యాలను సమర్పించాలి.
- పూజ సమయంలో "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం ఉత్తమం.
- రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ సాత్విక ఆహారంతో లేదా ఫలహారంతో పారణ చేయాలి.
- భక్తితో చేసే పూజ ఏ చిన్నదైనా స్వామివారు స్వీకరిస్తారు అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున శక్తి కొలదీ పేదలకు అన్నదానం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


