సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు ఏవి, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?
మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం ఉంటుంది. సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు, సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన కలిగే ఫలితాలు, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం, పూజలు, భజనలు, దేవుని ఉత్సవాలు, తీర్థయాత్రలకు వెళ్లడం వలన కలిగే లాభాలు తెలుసుకోండి.
సూర్యుడికి పువ్వులు అంటే ఎంతో ప్రీతి. వీటిని సూర్యుడికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్య నారాయణ మూర్తి ప్రత్యేక అనుగ్రహం కూడా కలుగుతుంది. సూర్యుడికి అవిసె పూలు, మోదుగ పూలు, మొగలి పూలు, బృంగరాజ, శమీ అంటే ఎంతో ఇష్టం. అలాగే విష్ణు తులసి, కృష్ణ తులసి, రక్త చందనం అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఇదే విషయం భవిష్య పురాణం చెబుతోంది.
సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు ఏవి, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? (pinterest)
2.సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన కలిగే ఫలితాలు
సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని ప్రసన్నతతో ఆయురారోగ్యాలు, ధన, ధాన్యాలు, క్షేత్రం, పుత్రులు, కలత్రం, మిత్రులు, తేజస్సు, యశస్సు, కాంతి, విద్య, సౌభాగ్యం, వైభవాలు కలుగుతాయి.
3.స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా?
చాలా మంది స్త్రీలకు ఉండే సందేహం ఇది. స్త్రీలు సూర్య నమస్కారం చేయవచ్చా, చేయకూడదా అనే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చు. సూర్య నమస్కారాలకు స్త్రీలు, పురుషులు అనే భేదం లేదని గుర్తు పెట్టుకోండి. పురుషులు సాష్టాంగ నమస్కారం, స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి.
4.సూర్య రథానికి సంకేతం ఏమిటి?
సూర్యుడు తన రథంపై ఏడు గుర్రాలతో కనపడతాడు. అతిథి, కశ్యపుల పుత్రుడైన సూర్యుడు బంగారు రథం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి బంగారు రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి. రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి.
ఒక చక్రం సంవత్సరానికి సంకేతం, ఆరు ఆకులు ఆరు ఋతువులకు సంకేతం, ఏడు గుర్రాలు ఏడు కిరణాలకు ప్రతీకగా చెబుతారు. సర్వసాక్షి, భూతుడైన సూర్యుడు కాలానికి కర్త. అందుకనే మన ప్రాచీనులు ఈ విషయాన్ని ప్రతీకాత్మకంగా వివరించారు.
5.పూజలు, భజనలు, దేవుని ఉత్సవాలు, తీర్థయాత్రలకు వెళ్లడం వలన కలిగే లాభాలు ఏమిటి?
చాలా మంది రకరకాల పూజలు చేస్తారు. అలాగే ఎవరైనా పూజలు చేసుకుంటే వారి ఇంటికి వెళ్తారు. భజనలు, దేవుని ఉత్సవాల్లో కూడా పాల్గొంటారు. అలాగే చాలా మంది తీర్థ యాత్రలకు వెళ్లడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి చేయడం వలన కలిగే లాభం ఏంటి? భగవంతుడికి పూజలు, భజనలు చేయడం, ఉత్సవాలు జరిపించడం, వాటిని చూడడానికి వెళ్లడం, తీర్థయాత్రలకు వెళ్లడం వలన చాలా మంచి జరుగుతుంది.
ముఖ్యంగా మనసులో దైవచింతనే ఉంటుంది. దైవ సంబంధిత ఆలోచనలు మనల్ని ఆధ్యాత్మిక జీవనం వైపుకు మళ్లించి ప్రశాంతతను ఇస్తాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక జీవనానికి సాధనాలుగా ఉపయోగపడతాయి.