...
...
Next Story

ఈరోజు సోమవారం+ప్రదోష వ్రతం.. శివుడికి ఈ 3 పరిహారాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయా?

ఆగస్టు 10న సోమవారం సందర్భంగా వచ్చే ప్రదోష వ్రతం శివభక్తులకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ప్రదోష కాలంలో మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.

Published on: Aug 10, 2026, 08:00:34 IST
Advertisement

హిందూ సనాతన ధర్మంలో పవిత్ర శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి కొన్ని రోజుల్లో శ్రావణ మాసం రాబోతోంది. ఆ నెలలో శివనామస్మరణతో దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మార్మోగుతుంటాయి. ఇక ప్రతి సోమవారంతో పాటు ప్రదోష వ్రతాలు కూడా భక్తులకు విశేష ఫలితాలను ప్రసాదిస్తాయని నమ్ముతారు.

ఈరోజు సోమవారం+ప్రదోష వ్రతం.. శివుడికి ఈ 3 పరిహారాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయా?
ఈరోజు సోమవారం+ప్రదోష వ్రతం.. శివుడికి ఈ 3 పరిహారాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయా?

ఈరోజు సోమవారం వేళ ప్రదోష వ్రతం. ఆగస్టు 10న సోమవారం రోజున ఈ పవిత్ర వ్రతం ఆచరిస్తే మంచిది. శివభక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరుపుతారు. ప్రదోష కాలంలో మహాదేవుడిని భక్తితో ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున సాయంత్రం వేళ శివారాధనలో ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు, పూజా విధానాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. పంచామృతంతో శివలింగాభిషేకం

ప్రదోష వ్రతం రోజున శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదార కలిపి స్వచ్ఛమైన పంచామృతాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పంచామృతంతో భోళాశంకరుడికి అభిషేకం చేయాలి.

అనంతరం పవిత్రమైన గంగాజలంతో శివలింగాన్ని కడగాలి. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని, అనారోగ్య సమస్యలు క్రమంగా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అభిషేక సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని, మీ మనసులోని కోరికను శివయ్యకు నివేదించండి.

2. మారేడు దళాలతో ప్రత్యేక పూజ

వీలైతే ఆకులు మూడింటిపై విడివిడిగా ఈ మంత్రాన్ని లిఖించాలి. ఆ తర్వాత పూర్తి నిష్టతో ఆ బిల్వ పత్రాలను శివలింగానికి సమర్పించాలి. పూజ చేసే సమయంలో నిరంతరం శివ పంచాక్షరి మంత్రం జపించాలి. ఈ పరిహారం ఆచరించడం ద్వారా నిలిచిపోయిన పనుల్లో వేగం పుంజుకుంటుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు.

3. నల్ల నువ్వులు, పచ్చ పాలతో అర్చన

గత కొంతకాలంగా ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నవారు ప్రదోష కాలంలో ఈ ప్రత్యేక పరిహారాన్ని పాటించవచ్చు. ప్రదోష సమయంలో శివలింగానికి పచ్చి పాలు, నల్ల నువ్వులు కలిపి సమర్పించాలి. జలంతో పాటు ఈ మిశ్రమాన్ని స్వామికి అర్పించడం వల్ల మానసిక ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవడంతో పాటు జాతకంలో రాహు-కేతువుల ప్రభావం వల్ల కలిగే చెడు ఫలితాలు సైతం గణనీయంగా తగ్గుతాయి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe