తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలి? తులసి ఆకులు కోయడానికి కూడా నియమాలున్నాయా?
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసి మొక్కను ప్రతిరోజూ పూజించి దీపారాధన చేయడం వల్ల విష్ణుమూర్తి, మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అయితే తులసి ఆకులను కోయడంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి తులసి మొక్క ఉన్నచోట ఉంటుందని కూడా నమ్మకం. తులసి మొక్కను రోజూ పూజించి, ప్రతి రోజూ దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తుంచకూడదు. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. తులసి ఆకులు కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోయడం, తులసి ఆకులను తుంచడం వంటివి చేయకూడదు.
తులసి ఆకులను ఎప్పుడు కోస్తే మంచిది?
తులసి ఆకులను కోయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, తులసి ఆకులను స్నానం చేసిన తర్వాత మాత్రమే కోయాలి. ఆకులను కోసి వృథా చేయకూడదు. ఎన్ని తులసి దళాలు అవసరమో అన్ని మాత్రమే కోసుకోవాలి.
తులసి ఆకులను పొరపాటున కూడా ఈ రోజుల్లో తెంపకండి
ఆదివారం తులసి ఆకులను కోయకూడదు. అలాగే ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా తులసి ఆకులను కోయకూడదు. శుక్రవారం కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు. తులసి ఆకులను కోసేటప్పుడు "ఓం తులస్యే నమః" అనే మంత్రం జపించండి.
మొక్క ఎండిపోతే ఏం చెయ్యాలి?
మొక్క పూర్తిగా ఎండిపోయినప్పటికీ, ఆ ఆకులలో ఉండే పవిత్రత నిలిచి ఉంటుంది. అందుకని ఎండిన తులసి ఆకులను లేదా మొక్కను ఎప్పుడూ చెత్తలో పడేయద్దు. ఆకులు ఎండిపోతే శుభ్రమైన నీటిలో నానబెట్టి పూజలకు లేదా ఇతర అవసరాలకు వాడడం మంచిది.
తులసి ఆకులను కోసే విధానం
తులసి ఆకులను కోసేటప్పుడు జాగ్రత్తగా చేతి వేళ్లతో తెంపాలి. గోరు తగలకూడదు. మొక్కకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిశుభ్రమైన, శుభ్రం లేని ప్రదేశంలో తులసి మొక్క ఉండకూడదు. అలాంటి ప్రదేశంలో ఉన్న తులసి ఆకులను కోసి దేవుడికి సమర్పించకూడదు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


