Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. విష్ణు పురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయి, మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. ఈసారి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం.
వైకుంఠ ఏకాదశి 2025

శేషతల్పం పై శయనించి విష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి ముక్కోటి దేవతలతో పాటు స్వామి వారు భూలోకానికి వచ్చే శుభ సందర్భం. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఎంతో మంచి జరుగుతుందని, శుభ ఫలితాలను పొందవచ్చని చెబుతారు. వైకుంఠ ఏకాదశిని (Vaikunta ekadashi 2025) ముక్కోటి ఏకాదశి (Mukkoti ekadashi) అని కూడా అంటారు.
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2025 తేదీ, సమయం
ఏకాదశి తిధి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 కి మొదలవుతుంది. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి. కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వారదర్శనాలు మొదలవుతాయి.
తిరుమలలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి
తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనాన్ని చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు ఏకాంత సేవ జరుగుతుంది. ఆ తర్వాత బంగారు వాకిలిని మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఏకాంత సేవ దాకా ఆలయ గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. పది రోజులు పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది.
శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి
శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 21 రోజులు పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణువు అవతారమైనటువంటి రంగనాథ స్వామి వైకుంఠ ఏకాదశి నాడు వజ్రాలతో చేసిన వస్త్రాలను ధరిస్తారు. అలాగే వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం నుంచి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతుంది.
వైకుంఠ ఏకాదశి విశిష్టత
{{/usCountry}}శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 21 రోజులు పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణువు అవతారమైనటువంటి రంగనాథ స్వామి వైకుంఠ ఏకాదశి నాడు వజ్రాలతో చేసిన వస్త్రాలను ధరిస్తారు. అలాగే వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం నుంచి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతుంది.
వైకుంఠ ఏకాదశి విశిష్టత
{{/usCountry}}మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకని ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అష్టాదశ పురాణాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయి.
వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి?
- వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
- విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ఉంటే ఎంతో మంచిది.
- దామోదర సహిత తులసీదేవిని పూజించాలి.
- ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండడంతో పాటుగా ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకోవాలి.
- నిష్టగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది.
- ఈ ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది.