ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఏప్రిల్ 13, సోమవారం నాడు వరూధిని ఏకాదశి రానుంది. వరూధిని ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. వరూధిని ఏకాదశి వేళా విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండాలంటే, మీ రాశి ప్రకారం ఈ ఆహార పదార్థాలను విష్ణువుకి నైవేద్యంగా (Varuthini Ekadashi Remedies) సమర్పించండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విష్ణువు మీ కోరికలు తీరుస్తాడు. మరి వరూధిని ఏకాదశి నాడు 12 రాశుల వారు ఏవీ నైవేద్యంగా పెట్టాలో తెలుసుకోండి.
వరూధిని ఏకాదశి నాడు 12 రాశుల వారు ఏం చెయ్యాలి?
మేష రాశి:

మేష రాశి వారు వరూధిని ఏకాదశి వేళా విష్ణు అనుగ్రహం కలగడానికి ఎరుపు రంగులో ఉండే స్వీట్లు, బూందీ లడ్డూలను నైవేద్యంగా పెడితే మంచిది. దీంతో సంతోషం, సంపద పెరుగుతాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారు విష్ణువుని ఆరాధించే పంచామృతాలను సమర్పించండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదారను పంచామృతాలు అంటారు. వీటిని సమర్పించడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
మిధున రాశి:
మిధున రాశి వారు పెసరపప్పుతో చేసిన హల్వాను విష్ణువుకి సమర్పించండి. ఇది వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది, మాటల మాధుర్యాన్ని పెంచుతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు విష్ణువుకి పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెడితే మంచిది. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు బెల్లంతో చేసిన స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారు పాలతో చేసిన ఆహార పదార్థాలను విష్ణువుకి నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషంగా ఉండొచ్చు, కోరికలు నెరవేరుతాయి.
తులా రాశి:
తులా రాశి వారు తెలుపు రంగులో ఉండే స్వీట్లు నైవేద్యంగా సమర్పించడం వలన మంచి జరుగుతుంది. శుభ ఫలితాలను చూస్తారు, జీవితంలో ఆనందం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}తులా రాశి వారు తెలుపు రంగులో ఉండే స్వీట్లు నైవేద్యంగా సమర్పించడం వలన మంచి జరుగుతుంది. శుభ ఫలితాలను చూస్తారు, జీవితంలో ఆనందం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారు బెల్లంతో చేసిన పాయసం లేదా స్వీట్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా ఉంటారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు లడ్డూలు, పసుపు రంగులో ఉండే పండ్లు వంటివి నైవేద్యంగా పెడితే మంచిది. అదృష్టం పెరుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.
మకర రాశి:
మకర రాశి వారు లడ్డూలు, పాలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషంగా ఉండొచ్చు.
కుంభ రాశి:
కుంభ రాశి వారు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెడితే మంచి జరుగుతుంది. సంపద పెరుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.
మీన రాశి:
మీన రాశి వారు పటిక బెల్లం, బూందీ లడ్డూలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. విష్ణువు అనుగ్రహంతో సంతోషం రెట్టింపు అవుతుంది.