Vastu Tips Lizard : ఇంట్లో బల్లిని ఎక్కడ చూస్తే శుభం? ఏ చోట చూస్తే అశుభం?
Vastu Tips Lizard : సాధారణంగా ఇంట్లో గోడలపై బల్లులను చూస్తాం. ఎక్కడ బల్లిని చూస్తే శుభం, ఏ చోట చూస్తే అశుభంగా పరిగణిస్తారో చూద్దాం..
ఇళ్ల గోడలపై బల్లులను కనిపించడం సర్వసాధారణం. కొందరు వాటిని శుభసూచకంగా భావిస్తే, మరికొందరు అశుభంగా భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం.. ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో బల్లి కనిపించడం అనేక శకునాలను సూచిస్తుంది. బల్లిని చూడటం భవిష్యత్తుకు సూచనగా పరిగణిస్తారు.

దీపావళి లేదా ఏదైనా శుభ సందర్భంలో బల్లిని చూడటం ఆర్థిక లాభానికి సంకేతంగా భావిస్తారు. అయితే శుభ లేదా అశుభ శకునాలకు బల్లి ఉన్న ప్రదేశం, దాని స్థానం చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో బల్లిని ఎక్కడ చూస్తే శుభం, ఎక్కడ చూస్తే అశుభం తెలుసుకుందాం..
పూజా స్థలం దగ్గర బల్లి
ఇంట్లోని పూజా స్థలం దగ్గర బల్లిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది అదృష్టం కలిసివస్తుందనడానికి సంకేతంగా చూస్తారు. పూజా స్థలం దగ్గర బల్లి ఉండటం సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది.
నేలపై బల్లిని చూడటం
వాస్తు శాస్త్రంలో నేలపై బల్లి నడవడం చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆర్థిక పురోగతికి, నిలిచిపోయిన ధనం లభించడానికి సంకేతంగా భావిస్తారు.
ధాన్యం దగ్గర బల్లి
బియ్యం లేదా గోధుమలు ఉంచే ప్రదేశంలో బల్లి ఉండటం కూడా శుభసూచకంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో బల్లిని చూడటం ఇంట్లో శ్రేయస్సు, సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు.
కొత్త ఇంట్లో
మొదటిసారి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు బల్లిని చూడటం చాలా శుభసూచకంగా పరిగణిస్తారు. ఇది పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ఆనందం, శ్రేయస్సు రాకను సూచిస్తుంది.
అశుభ సంకేతాలు
- ఇంట్లో బల్లులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం చూడటం అశుభ సంకేతంగా చెబుతారు. ఇది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో విభేదాలు, గొడవలు, అసమ్మతులను సూచిస్తుంది.
- ఇంట్లో చనిపోయిన బల్లిని చూడటం అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లోకి ఏదైనా వ్యాధి లేదా ప్రతికూల శక్తి ప్రవేశాన్ని సూచించవచ్చు.
- నల్లబల్లి ఒక అశుభ సంకేతంగా చెబుతారు. ఇది రాబోయే కష్టాలను లేదా ఒక అశుభ సంఘటనను సూచిస్తుంది.
- ఇంట్లో అకస్మాత్తుగా అధిక సంఖ్యలో బల్లులను చూడటం అశుభ సంకేతంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇది బలహీనమైన రాహువు ప్రభావం కావచ్చు. ఇది మానసిక ఒత్తిడికి, గందరగోళానికి దారితీయవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


