వట పౌర్ణిమ 2026: జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు పెళ్లయిన మహిళలు భక్తిశ్రద్ధలతో వట పౌర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్త ఆయురారోగ్యాల కోసం, సుఖమైన దాంపత్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, పురాణ గాథలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిమూర్తుల నిలయం మర్రి వృక్షం

సనాతన ధర్మంలో వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో మర్రి చెట్టుకు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా దీనిని భావిస్తారు. ఈ వృక్షం దైవికమైన శక్తిని కలిగి ఉంటుందని నమ్మకం. ఈ చెట్టు వేళ్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని విశ్వాసం. అందుకనే ఒకసారి మర్రి వృక్షాన్ని ఆరాధించడం త్రిమూర్తులను ఆరాధించినంత పుణ్యఫలాన్ని ఇస్తుందని భావిస్తారు. మహిళలు వట పౌర్ణిమ నాడు మర్రి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
సావిత్రి–సత్యవంతుల గాథ
పురాణాల ప్రకారం, యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలను తీసుకువెళ్తుంటే, సావిత్రి తన పాతివ్రత్యంతో, భక్తితో, పట్టుదలతో యమధర్మరాజును అడ్డుకుంటుంది. సావిత్రి భక్తికి, జ్ఞానానికి మెచ్చిన యముడు ఆమెకు వరమిచ్చి సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ప్రసాదిస్తాడు. సత్యవంతుడు స్పృహలోకి వచ్చేసరికి అతడు మర్రి చెట్టు కిందనే ఉంటాడు.
ఆ అద్భుత ఘట్టానికి మర్రి చెట్టే సాక్షిగా నిలిచింది. అందుకే అప్పటి నుంచి పెళ్లయిన మహిళలు భర్త దీర్ఘాయుష్షు, అఖండ సౌభాగ్యం కోసం మర్రి చెట్టును పూజించడం ఆచారంగా మారింది. ఆ రోజు మహిళలు సంప్రదాయబద్ధంగా అలంకరణ చేసుకుని, మర్రి చెట్టు చుట్టూ పవిత్ర దారాన్ని చుట్టుతూ ప్రదక్షిణలు చేసి భక్తిని చాటుకుంటారు.
పూజా విశేషాలు – ఫలితాలు
వట పౌర్ణిమ నాడు మహిళలు ఉపవాసం ఉండి మర్రి వృక్షానికి జలాభిషేకం చేస్తారు. పవిత్ర దారాన్ని చెట్టు చుట్టూ చుట్టడం ద్వారా తమ దాంపత్య బంధం మర్రి వృక్షం మాదిరి దృఢంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, భర్తకు వచ్చే ఆపదలు తొలగిపోతాయని, అఖండ సౌభాగ్యం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తారు.
ఉపవాసం ఉండి ఏం చేయాలి?
{{/usCountry}}వట పౌర్ణిమ నాడు మహిళలు ఉపవాసం ఉండి మర్రి వృక్షానికి జలాభిషేకం చేస్తారు. పవిత్ర దారాన్ని చెట్టు చుట్టూ చుట్టడం ద్వారా తమ దాంపత్య బంధం మర్రి వృక్షం మాదిరి దృఢంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, భర్తకు వచ్చే ఆపదలు తొలగిపోతాయని, అఖండ సౌభాగ్యం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తారు.
ఉపవాసం ఉండి ఏం చేయాలి?
{{/usCountry}}మహిళలు రోజంతా ఉపవాసం ఉండి, సోడశ అలంకరణలు ధరించి, మర్రి చెట్టు వద్దకు వెళ్లి పూజలు, ప్రదక్షిణలు నిర్వహించాలి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.