విజయ ఏకాదశి వ్రత కథ: శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి వ్రతం, ఈ వ్రత కథ చదివినా పుణ్యమే!

విజయ ఏకాదశి ఫిబ్రవరి 13న, అనగా ఈరోజు వచ్చింది. సనాతన ధర్మం ప్రకారం 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. ఏకాదశి తిథి ఎప్పుడూ కూడా శుభప్రదమైనది. ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. రామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథను చదువుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది.

Published on: Feb 13, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి (Vijaya Ekadashi 2026) అని అంటారు. విజయ ఏకాదశి ఫిబ్రవరి 13న, అనగా ఈరోజు వచ్చింది. సనాతన ధర్మం ప్రకారం 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. అధిక మాసం వస్తే మరో రెండు ఏకాదశులు ఎక్కువవుతాయి. ఏకాదశి తిథి ఎప్పుడూ కూడా శుభప్రదమైనది.

విజయ ఏకాదశి వ్రత కథ: శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి వ్రతం (pinterest)
విజయ ఏకాదశి వ్రత కథ: శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి వ్రతం (pinterest)

విజయ ఏకాదశి

ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది వచ్చే విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. విజయ ఏకాదశి నాడు రాముడు ఉపవాసం ఉండి విజయాన్ని పొందినట్లు తెలుస్తోంది. మరి ఏకాదశి వ్రత కథ కూడా తెలుసుకుందాం.

విజయ ఏకాదశి వ్రత కథ:

రామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథను చదువుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి విజయ ఏకాదశి నాడు విష్ణువును పూజించే ఈ ఏకాదశి వ్రత కథను కూడా చదువుకోండి. రావణుడి చెరలో ఉన్న సీతను విడిపించడానికి రాముడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు. వానర సైన్యం ఆ సముద్రాన్ని దాటి లంకకు ఎలా చేరుకోవాలి అని ఆలోచనలో ఉంది. అప్పుడు లక్ష్మణుడు అక్కడ సమీపంలో ఉన్న బకదళభ్యుడు అనే ఋషి దగ్గరకు వెళ్దామని చెప్పాడు. అక్కడికి వెళ్లి నివసిస్తున్న ఋషి సలహా అడుగుదామని రాముడితో చెప్పాడు.

ఋషి సలహా

అప్పుడు రాముడు అంగీకరించి ఆ ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. ఋషి రాముడిని చూడగానే ఆయన విష్ణువు అవతారమని తెలుసుకుంటాడు. అయినప్పటికీ రావణుడిని జయించి విజయం కలగాలంటే విజయ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే విజయం కలుగుతుందని సూచించాడు.

విజయం

అప్పుడు రాముడు విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. తర్వాత సేతువును నిర్మించి, వానరులతో పాటు లంకకు చేరుకుని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. విజయ ఏకాదశి నాడు ఈ వ్రతం ఆచరించడం వలన విజయం కలుగుతుందని అంటారు.

వ్రత గొప్పతనం:

ఈ వ్రత గొప్పతనం గురించి స్కాంద పురాణం, రామాయణంలో కూడా చెప్పబడింది. ఈ ఏకాదశి నాడు ఉపవాస నియమాలను పాటించినా, పాటించకపోయినా ఈ వ్రత కథను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. విజయం కలుగుతుంది. ఈ ఏకాదశి నాడు “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రాన్ని, విష్ణు సహస్రం పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.