చాలా మంది ఇళ్లల్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి, ఆర్థిక బాధల నుంచి, కలహాల నుంచి, దిష్టి బాధల నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈరోజు సంతోషంగా ఉండడానికి, అదృష్టం పెరగడానికి కొన్ని పరిహారాలను చూద్దాం. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సమస్యలను చిటికెలో తొలగిస్తాయి.
చీమలు పట్టే చోట ఇలా చేయండి

ఏడు చింతపిక్కలను తీసుకుని ఎక్కడైనా చీమలు పట్టే చోట వాటిని వేయండి. చీమలు తినే కొద్దీ దిష్టి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు మీ చేతికి వస్తుంది.
మంగళవారం నాడు ఈ పరిహారాన్ని పాటించండి
మంగళవారం కొంచెం చింతపండును ఎవరూ తిరగని చోట, నిర్మానుష్య ప్రదేశంలో వేయండి. దీంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.
హుండీలో ఎంత వేయాలి? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి?
హుండీలో 7 రూపాయలు వేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.
హుండీలో 9 రూపాయలు వేయడం వలన శత్రు భయం తొలగిపోయి, శని దోషాలు కూడా తొలగిపోతాయి.
హుండీలో 11 రూపాయలు వేస్తే అప్పుల బాధల నుంచి బయటపడొచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరంగా ఉండొచ్చు.
హుండీలో 12 రూపాయలు వేస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా సరే మాయమైపోతాయి.
హుండీలో 21 రూపాయలు వేయడం వలన దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. ఆనందంగా ఉండొచ్చు.
లక్ష్మీ కటాక్షానికి రాజమార్గం మణిద్వీప వర్ణన పారాయణం
లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య నాడు మణిద్వీపవర్ణన పారాయణం చేస్తే చాలా మంచిది. మణిద్వీప వర్ణన పారాయణం ప్రదోషకాలంలో చేయాలి. అంటే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు.
{{/usCountry}}లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య నాడు మణిద్వీపవర్ణన పారాయణం చేస్తే చాలా మంచిది. మణిద్వీప వర్ణన పారాయణం ప్రదోషకాలంలో చేయాలి. అంటే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు.
{{/usCountry}}11 రకాల పూలతో 11 సార్లు మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
21 రకాల పుష్పాలతో 21 సార్లు పారాయణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
32 సార్లు, 32 రకాల పువ్వులతో మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది.
మణిద్వీప వర్ణన పారాయణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
ఉతికిన బట్టలతో పూజగదిలో కూర్చుని మణిద్వీప వర్ణన పారాయణం చేయాలి.
ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలను వెలిగించి, ఆ తర్వాత పూజ చేయాలి.
అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏది కావాలనుకుంటే అది సంకల్పం చెప్పుకుని, మణిద్వీపం అద్భుతాలను తలుచుకుంటూ ఏకాగ్రతతో పూజ చేయాలి.
చివరగా ఆ అమ్మకు పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.