Kanuma 2026: కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? ఆ రోజు ఏం చెయ్యాలో తెలుసుకోండి!

సంక్రాంతి నాడు పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు చేసుకోవడం, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడిపందాలు ఇలా ఎన్నో ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సందడి అంతా ఊర్లోనే ఉన్నట్టు సరదాగా, సంతోషంగా పండుగను జరుపుకుంటారు. కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? ఆ రోజు ఏం చెయ్యాలో తెలుసుకోండి.

Published on: Jan 15, 2026 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి నాడు అందరూ పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు చేసుకోవడం, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడిపందాలు ఇలా ఎన్నో ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సందడి అంతా ఊర్లోనే ఉన్నట్టు సరదాగా, సంతోషంగా పండుగను జరుపుకుంటారు.

Kanuma 2026: కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? (pinterest)
Kanuma 2026: కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? (pinterest)

సంక్రాంతి పండుగ 2026

సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ నాడు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. సాయంత్రం ఊరేగింపు చేస్తారు. అయితే కనుమ నాడు పశువులకు ఇష్టమైన ఆహారాన్ని కూడా వండి పెడతారు. ఇక ఇది ఇలా ఉంటే, కనుమ నాడు పొలిమేర దాటకూడదని పెద్దలు అంటారు. అయితే అలా ఎందుకు చెబుతారు? కనుమ నాడు పాటించాల్సినవి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కీడు జరుగుతుందని ప్రయాణం చేయొద్దంటారు

కనుమ నాడు ప్రయాణం చేస్తే కీడు జరిగే అవకాశం ఉందని అంటారు. అందుకే మూడు రోజుల పాటు పండుగను జరుపుకుని, ఆ తర్వాత ప్రయాణం చేయమని పెద్దలు అంటారు. అయితే, ఇది ఎవరి అభిప్రాయం వారిదే. ఎవరికి నచ్చినట్లు వారు ఫాలో అవుతూ ఉంటారు.

పశువులకు పూజలు, పూర్వికులకు తర్పణాలు

కనుమ నాడు ఉదయాన్నే పశువుల్ని ఆరాధించి, మధ్యాహ్నం పూట పూర్వీకులకు తర్పణలు ఇవ్వడం వంటివి జరుపుతారు. కొన్ని చోట్ల అయితే కనుమ నాడు గ్రామ దేవతలకు కోడి, గొర్రె, పొట్టేళ్లు, మేకపోతులను బలి ఇస్తారు. కనుమ నాడు ఇలా చాలా పనులు ఉంటాయి కనుక, ఈ రోజు ప్రయాణం చేయొద్దని, విశ్రాంతి తీసుకోమని పెద్దలు అంటారు.

విందు భోజనాలు

సంక్రాంతి పండుగకు మొదటి రెండు రోజులు పిండి వంటలు చేసుకుని తింటారు. మూడవ రోజు మాత్రమే మాంసాహారం తింటారు. కనుమ నాడు పోషక విలువలు ఎక్కువగా ఉండే మినుములను కూడా తినమని చెబుతారు. వీటిని తింటే శరీరానికి తగినంత వేడి అందుతుంది. చలిని తట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది.

ముక్కనుమ పండుగ

ముక్కనుమను ఎక్కువగా గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో బాగా జరుపుకుంటారు. ఆ రోజు పుష్టిగా మాంసాహారాన్ని తింటారు. తమిళనాడులో అయితే ముక్కనుమ నాడు తాజా కూరగాయలతో కందిపప్పు, చింతపండు, బెల్లం కలిపి ప్రత్యేక వంటకాన్ని చేసుకుంటారు. కనుమ, ముక్కనుమ నాడు దేవతలందరూ మన ఇంటికి వస్తారని అంటారు. అందుకనే ఆ రోజు ప్రయాణం చేయకూడదని కూడా చెప్తారు.