స్టార్టప్లను ప్రోత్సహించడానికి రూ.1000 కోట్లతో ఫండ్ : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ను స్టార్టప్స్ కేంద్రంగా చేయనునున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో తొలిసారిగా గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రూ.1,000 కోట్ల స్టార్టప్ నిధిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1998లో గూగుల్ ప్రారంభమైన తీరును ప్రస్తావించారు. 2034 నాటికి హైదరాబాద్ నుండి కనీసం 100 స్టార్టప్లు యూనికార్న్లుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. హైదరాబాద్లోని టి-హబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జీఎఫ్ఎస్) కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించారు.

తెలంగాణలో శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడానికి హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జీఎఫ్ఎస్) హబ్ ప్రారంభం భారతదేశంలో మొట్టమొదటిదన్నారు. స్టార్టప్లకు మద్దతు వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం, గూగుల్ కలిసి వచ్చాయని సీఎం అన్నారు. 'విజయవంతమైన వ్యవస్థను సృష్టించడానికి మేం కలిసి పని చేస్తాం. 1998లో గూగుల్ స్టార్టప్గా గారేజీలో ప్రారంభమైంది. తర్వాత ప్రపంచంలోనే గొప్పదిగా మారింది. బిలియన్ డాలర్ల కంపెనీలుగా స్టార్టప్లు ఎదగాలి. గత రెండు రోజుల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాం. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేశాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
స్టార్టప్ల కోసం తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్టప్లు యూనికార్న్లుగా మారాలనే ఆశయంతో అనుసంధానించబడిందని రేవంత్ రెడ్డి అన్నారు. '15 లేదా 20 సంవత్సరాల కంటే తక్కువ కాలం క్రితం స్టార్టప్లుగా ఉన్న అనేక కంపెనీలు ఇప్పుడు బిలియన్ల డాలర్ల విలువైనవి. గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్బుక్ గొప్ప ఉదాహరణలు. గత 25 సంవత్సరాలలో సాఫ్ట్వేర్ సేవలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్లలో హైదరాబాద్ ఆధారిత కంపెనీల అద్భుతమైన వృద్ధి సాధించాయి.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
స్టార్టప్ విజయానికి టీమ్ కృషిని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. స్టార్టప్లు ఫుట్బాల్ లాంటివన్నారు. తాను ఫుట్బాల్లో మీరు కష్టపడి పనిచేయాలి, కష్టపడి సాధన చేయాలన్నారు. ఇది జట్టుకృషి అని, చివరగా, గెలవడం చాలా ముఖ్యమని చెప్పారు. స్టార్టప్ల విషయంలో కూడా అంతేనని తెలిపారు. రూ.1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్లను ఉపయోగించుకోవాలని ఆయన స్టార్టప్ వ్యవస్థాపకులను సూచించారు.
ఎంపిక చేసిన ఏఐ-ఫస్ట్ స్టార్టప్లకు ఉచిత, ఏడాది పొడవునా అంకితమైన కోవర్కింగ్ సీట్లు, క్యూరేటెడ్ వెంచర్ ఇన్వెస్టర్ల సెట్తో సహా తెలంగాణ నుండి ప్రాంతీయ స్టార్టప్లను గూగుల్ స్టార్టప్స్ హబ్ ద్వారా నిమగ్నం చేయాలని గూగుల్ యోచిస్తోంది. హైదరాబాద్ కేవలం స్టార్టప్లకే కాకుండా యూనికార్న్ల హబ్గా కూడా మారాలని తాను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి అన్నారు. 2034 నాటికి హైదరాబాద్ నుండి కనీసం 100 స్టార్టప్లు యూనికార్న్లుగా మారాలని, వాటిలో కనీసం 10 సూపర్ యూనికార్న్లుగా మారాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


