KRMB : తాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15 వరకు ఏపీ, తెలంగాణకు 31 టీఎంసీలు కేటాయింపు
KRMB : ఆగస్టు 15 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబీ 31 టీఎంసీల నీటిని కేటాయించింది. మరోవైపు పలు విషయాలపై చర్చించడానికి రివర్ బోర్డ్ 21వ సమావేశం మే 14న జరగనుంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)కు చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాంపులు చేసింది. తెలంగాణకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుండి 21 టీఎంసీలు,, ఆంధ్రప్రదేశ్కు నాగార్జునసాగర్ నుండి 10 టీఎంసీల నీటిని కేటాయించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్-ఇన్-చీఫ్లు కె. నరసింహ మూర్తి, ఓ.వి. రమేష్ బాబు, నదీ బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్లతో కూడిన ఈ కమిటీ, ఉమ్మడి జలాశయాలు రెండింటిలోనూ నీటి లభ్యతను సమీక్షించింది. ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాలను తీర్చడానికి తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 31 టీఎంసీల నీటిని కేటాయించాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 29 నాటి తన లేఖలో ఆంధ్రప్రదేశ్ మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుండి 10 టీఎంసీల నీటిని కోరుతూ ఒక ఇండెంట్ను సమర్పించింది. అదేవిధంగా మే 2 నాటి తన ఇండెంట్లో తెలంగాణ జూన్ 30 వరకు తాగునీటి అవసరాల కోసం 18 టీఎంసీల అడుగుల నీటి ఆవశ్యకతను తెలియజేసింది. ఇందులో నాగార్జునసాగర్ నుండి 13 టీఎంసీలు, శ్రీశైలం నుండి 5 టీఎంసీలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీ అడుగుల నీటిని కేటాయించిన తర్వాత, తాగునీటి అవసరాలను తీర్చడానికి ఆగస్టు 15 వరకు నాగార్జునసాగర్ నుండి 16 టీఎంసీల అడుగుల నీటిని కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
హైదరాబాద్ నగరం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ఈ ఇండెంట్ను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే కేటాయించిన పరిమాణం కంటే చాలా ఎక్కువ నీటిని ఆ రాష్ట్రం వాడుకుందని, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నీటిని కేటాయిస్తే తెలంగాణలో తాగునీటి సంక్షోభం తలెత్తుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు చేసే ఏ కొత్త నీటి కేటాయింపునైనా తెలంగాణ వ్యతిరేకించింది.
శ్రీశైలం జలాశయంలో స్థూల నీటి నిల్వ సుమారు 39.2 టీఎంసీలుగా ఉంది. అలాగే మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి నాగార్జునసాగర్లో నీటి నిల్వ 157.6 టీఎంసీలుగా నమోదైంది. ఇదిలా ఉండగా 2026-27 జల సంవత్సరంలో రెండు రాష్ట్రాల ద్వారా నీటి వినియోగం, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, ఇతర పెండింగ్ అంశాల వంటి విషయాలను చర్చించడానికి రివర్ బోర్డ్ 21వ సమావేశం మే 14న జరగనుంది.
ఈ సమావేశానికి రివర్ బోర్డు ఛైర్మన్, ఇతర సభ్యులు, సాగునీరు/జలవనరుల శాఖల కార్యదర్శులు, అలాగే ఆయా శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, ఇంజనీర్లు హాజరుకానున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


