...
...
Next Story

తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి : కిషన్ రెడ్డి

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ స్టేషన్‌లో పలు ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

Updated on: Aug 30, 2026, 16:02:50 IST
Advertisement

వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 27 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఆధునీకరణ, పునర్నిర్మాణ పనుల పురోగతిని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు, ఆధునీకరించేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా వికారాబాద్ స్టేషన్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.

పనులను పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి
పనులను పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా వికారాబాద్, తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు సరికొత్త హంగులతో సిద్ధమవుతున్నాయి.

వికారాబాద్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల వేగవంతమైన ఎదుగుదలను, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్‌లో పలు ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రయాణికులు హాయిగా వేచి ఉండేందుకు అధునాతన వెయిటింగ్ హాళ్లు నిర్మిస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక లాంజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. వాహనాల రాకపోకలకు అనువుగా ఆధునిక పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని రైల్వే లైన్ల మార్గాల విద్యుదీకరణ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచేందుకు డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల విస్తరణ) పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నరు.

రైలు ప్రమాదాల నివారణకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అత్యంత సురక్షితమైన కవచ్, కవచ్ 2.0 రక్షణ వ్యవస్థలను తెలంగాణలో తొలిసారిగా అమల్లోకి తెస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తూ హైస్పీడ్ కనెక్టివిటీని గణనీయంగా పెంచాయన్నారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణేలతో అనుసంధానించే బుల్లెట్ రైలు సేవలు భవిష్యత్తులో తెలంగాణ రూపురేఖలను మార్చనున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేగవంతమైన వృద్ధి చెందుతుందన్నారు. అంతర్‌రాష్ట్ర రవాణా, వాణిజ్య బంధాలు మరింత బలపడతాయన్నారు. రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల రంగాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe