TS SSC Results 2026 : ఈ నగరానికి ఏమైంది.. తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల్లో హైదరాబాద్ లాస్ట్!
TS SSC Results 2026 : తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల్లో 95.15 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఈసారి కూడా బాలికలే హవా కొనసాగించారు. ములుగు జిల్లా టాప్లో ఉండగా.. హైదరాబాద్ లాస్ట్లో ఉంది.
తెలంగాణలో మార్చి 2026లో జరిగిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29న అధికారికంగా వెలువడ్డాయి. ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం విశేషం. 2025లో 92.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ఈసారి 95.15 శాతానికి చేరింది.

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో కూడా అమ్మాయిలే హవా కొనసాగించారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే 2.19 శాతం మెరుగైన ఫలితాలను సాధించారు. అబ్బాయిల ఉత్తీర్ణత 94.07 శాతంగా ఉంటే, అమ్మాయిలు ఏకంగా 96.26 శాతంతో సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండటం గమనార్హం.
జిల్లా వారీగా చూస్తే..
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ములుగు జిల్లా 99.30 శాతంతో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. విద్యా సదుపాయాలు తక్కువగా ఉండే మారుమూల జిల్లా ఇలా అగ్రస్థానానికి రావడం వెనుక ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల కనిపిస్తోంది. దీనికి భిన్నంగా, అన్ని వసతులు ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో చివరి స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. నగర ప్రాంతాల్లోని విద్యార్థులు ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం లేదా ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లోపించడం దీనికి కారణం కావచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు 99.10 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతం పొందాయి.
తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత 95.15 శాతంగా సాధించినవని బోర్డు వెల్లడించింది.
పాఠశాలల వారీగా గణాంకాలు
రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, కేవలం 6 పాఠశాలలు మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- https://results.bsetelangana.org , https://bse.telangana.gov.in, https://results.bse.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే Regular & Private (SSC & OSSC) Results అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.
- నెంబర్ సరిచూసుకుని submit బటన్ మీద నొక్కండి.
- మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. మార్కుల షీట్ డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు ప్రింట్ తీసుకోవడం బెటర్.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


