ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టిన మరో పెద్ద అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం) మర్రి వంశీమోహన్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

శుక్రవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆయన నివాసంతో పాటు మేడ్చల్ యూఎల్సీ కార్యాలయం, గుంటూరులోని ఆయన మామ ఇల్లు, బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
మార్కెట్ విలువ రూ.100 కోట్లు!
ఈ సోదాలలో వంశీమోహన్కు చెందిన భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం వీటి ఖరీదు రూ.6.22 కోట్లు (ఇందులో రూ.5.68 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి). అయితే, బహిరంగ మార్కెట్లో వీటి అసలు విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల అనంతరం వంశీమోహన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
శేరిలింగంపల్లి తహసీల్దార్గా ఉన్నప్పుడే
వంశీమోహన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది ఆయన శేరిలింగంపల్లి తహసీల్దార్గా పనిచేసిన కాలంలోనే (2019-23) పడినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్ ప్రాంతంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.
మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖానామెట్, గుట్టలబేగంపేట్, గోపన్పల్లి, హఫీజ్పేట్ ప్రాంతాల్లోని వివాదాస్పద ప్రభుత్వ భూములపై కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ.. అవేవీ ఖాతరు చేయకుండా ప్రైవేటు వ్యక్తులు పాగా వేసేలా సహకరించారు. ఈ అక్రమాల్లో అప్పటి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి ఒకరు వంశీమోహన్కు అండగా నిలిచారని, వారిద్దరూ కలిసి పెద్ద ఎత్తున లబ్ధి పొందారని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
మామ పేరిట రిజిస్ట్రేషన్
దాడుల పరంపరలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు చేశారు. సెలవులో ఉన్న తహసీల్దార్ను ప్రత్యేకంగా పిలిపించి రికార్డులను తనిఖీ చేశారు. పిగ్లీపూర్ గ్రామం సర్వే నంబర్ 17లోని 8 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు వివాదాస్పద వ్యవసాయ భూమిని వంశీమోహన్ తన మామ విజయ్భాస్కర్ పేరిట 2023లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆధారాలు లభించాయి.
{{/usCountry}}దాడుల పరంపరలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు చేశారు. సెలవులో ఉన్న తహసీల్దార్ను ప్రత్యేకంగా పిలిపించి రికార్డులను తనిఖీ చేశారు. పిగ్లీపూర్ గ్రామం సర్వే నంబర్ 17లోని 8 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు వివాదాస్పద వ్యవసాయ భూమిని వంశీమోహన్ తన మామ విజయ్భాస్కర్ పేరిట 2023లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆధారాలు లభించాయి.
{{/usCountry}}ఆ తర్వాత ఈ భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించి, దానికి ప్రతిఫలంగా సదరు వెంచర్లో 10 ఖరీదైన ప్లాట్లను వంశీమోహన్ లంచంగా పొందినట్లు వస్తున్న ఆరోపణలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ముందే ఊహించి.. పక్కా స్కెచ్తో లాకర్లు ఖాళీ!
డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ చాలా తెలివిగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎప్పటికైనా తనపై ఏసీబీ నిఘా పడుతుందని ఊహించిన ఆయన, గడిచిన రెండేళ్లుగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. వనస్థలిపురంలోని ఇంట్లో కనీసం ఆస్తి పత్రాలు కూడా దొరకకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.
ఆయనకు చెందిన రెండు బ్యాంక్ లాకర్లను తెరిచి చూడగా, అందులో కనీసం భార్య బంగారు ఆభరణాలు కూడా లేవు. ఏసీబీ రైడ్ జరుగుతుందనే ముందస్తు అనుమానంతోనే పక్కా ప్లాన్ ప్రకారం నగదు, బంగారం, డాక్యుమెంట్లను సురక్షిత ప్రాంతాలకు లేదా బినామీల వద్దకు మార్చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా పెద్దగా లావాదేవీలు కూడా ఏం చేయలేదు.