...
...
Next Story

Sunkari Narhari ACB Case : కదులుతున్న 'నరహరి' అవినీతి డొంక - బ్యాంక్ లాకర్‌లో రూ.1.50 కోట్ల నగదు గుర్తింపు

Sunkari Narahari Rao ACB Case : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ సోదాలు ముమ్మరం చేసింది. శాలిబండలోని కెనరా బ్యాంక్ లాకర్‌లో అదనంగా రూ.1.50 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published on: Jun 20, 2026, 15:48:53 IST
Advertisement

Sunkari Narahari Rao ACB Case : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుకు సంబంధించిన అక్రమ సంపాదన ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శాలిబండలోని కెనరా బ్యాంక్ శాఖలో ఉన్న నరహరి రావు వ్యక్తిగత లాకర్‌ను ఏసీబీ అధికారులు శనివారం తెరిచారు. ఈ సోదాల్లో లాకర్‌లో గుట్టలుగా దాచిన రూ.1.50 కోట్ల నగదును చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆ డబ్బు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని లెక్కింపు పూర్తి చేశారు.

ఇటీవలే సోదాలు…

బ్యాంక్ లాకర్‌లో రూ.1.50 కోట్ల నగదు
బ్యాంక్ లాకర్‌లో రూ.1.50 కోట్ల నగదు

సుంకరి నరహరి రావుపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవలే ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ఇప్పటివరకు లభించిన ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారమే రూ.13.05 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నరహరి రావు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఏసీబీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ప్రకారం….. నిందితుడి పేరిట 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లు, రెండు బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును వెనకేసినట్లు ఆధారాలు లభించడంతో ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe