...
...
Next Story

2025 : తెలంగాణలో 199 అవినీతి కేసులు నమోదు.. 273 మంది నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ 2025లో 199 కేసులు నమోదు చేసింది. అవినీతి ఫిర్యాదుల కోసం క్యూఆర్ కోడ్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించింది.

Published on: Dec 31, 2025, 15:04:39 IST
Advertisement

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) 2025లో మొత్తం 199 కేసులు నమోదు చేసి, 273 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఇయర్ రౌండ్ అప్‌లో తెలిపింది. మొత్తం కేసుల్లో 157 ట్రాప్ కేసులు, వీటిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన 15 కేసులు, నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించిన 26 ఇతర కేసులు కూడా ఏసీబీ నమోదు చేసింది, వీటిలో 34 మంది నిందితులను అరెస్టు చేశారు.

ఏసీబీ
ఏసీబీ

ఈ సంవత్సరంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ 26 సాధారణ విచారణలు నిర్వహించింది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లతో సహా వివిధ కార్యాలయాలలో 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం నుండి ప్రాసిక్యూషన్ కోసం 115 అనుమతి ఉత్తర్వులను పొందింది. తదనుగుణంగా ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది.

2025లో నమోదైన 157 ట్రాప్ కేసుల్లో ఏసీబీ మొత్తం రూ.57.17 లక్షలను స్వాధీనం చేసుకుంది. అందులో రూ.35.89 లక్షలు ఫిర్యాదుదారులకు తిరిగి చెల్లించారు. 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.96.13 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

నివారణ, సామర్థ్య నిర్మాణ చర్యలలో భాగంగా ఏసీబీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 73 మంది అధికారులకు ప్రాథమిక ఇండక్షన్ శిక్షణను అందించారు, అలాగే నిఘా పద్ధతులు, ఆర్థిక దర్యాప్తు, డిజిటల్ లావాదేవీల ట్రాకింగ్, బినామి ఆస్తుల చట్టం, ట్రాప్ అండ్ డీఏ కేసుల చట్టపరమైన అంశాలలో ప్రత్యేక శిక్షణను అందించారు.

ఈ నెల ప్రారంభంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఆధ్వర్యంలో అవినీతి నిరోధక వారోత్సవాలు(డిసెంబర్ 3 నుంచి 9, 2025) నిర్వహించారు. పౌరులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలోని వారు, మధ్యవర్తులు లేకుండా త్వరగా, సురక్షితంగా ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, బహుమతులను కూడా అందించింది ఏసీబీ.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe