హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు.. హెచ్-ఫాస్ట్ బృందంతో కలిసి కాటేడాన్లో ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అల్లం పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆహార కల్తీ దందాను అధికారులు ఛేదించారు. నాలుగు టన్నులకు పైగా కలుషితమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం ముడిసరుకులతో అపరిశుభ్రమైన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని రెస్టారెంట్లు, టోకు వ్యాపారులకు సరఫరా చేస్తున్న యూనిట్ యజమానిని అరెస్టు చేశారు.

ఇక్కడి నుంచి నగరంలోని రెస్టారెంట్లు, టోకు వ్యాపారులకు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాటేడాన్లోని ఒక తయారీ యూనిట్పై అధికారులు దాడి చేయగా.. 4 టన్నుల (4,032 కేజీల) అల్లం-వెల్లుల్లి పేస్ట్తో పాటు, 6,200 కేజీలకు పైగా నాసిరకం ముడి పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 22 లక్షలు ఉంటుంది.
టాస్క్ ఫోర్స్(ఖైరతాబాద్) దర్యాప్తు బృందాలు.. హెచ్-ఫాస్ట్ బృందంతో కలిసి తయారీ యూనిట్ యజమాని హసన్ అలీ రూపానీని అరెస్టు చేశాయి. తనిఖీ సమయంలో వెల్లుల్లి తొక్కలు వంటి నాసిరకం ముడి పదార్థాలతో పాటు, ఎసిటిక్ యాసిడ్, ఇతర రసాయన పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్రమైన పరిస్థితులలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.
ఆ ఉత్పత్తులను దుమ్ము.. ఈగలకు వాలేలా తెరిచిన డబ్బాలలో నిల్వ ఉంచారు. సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్యాక్ చేశారని తెలుస్తోంది. నగరవ్యాప్తంగా ఉన్న హోల్సేల్ కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలకు ఈ కల్తీ పేస్ట్ను సరఫరా చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
తయారీ యూనిట్ యజమానిని, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి విచారణ కోసం మైలార్దేవపల్లి పోలీసులకు అప్పగించారు.
{{/usCountry}}తయారీ యూనిట్ యజమానిని, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి విచారణ కోసం మైలార్దేవపల్లి పోలీసులకు అప్పగించారు.
{{/usCountry}}ఇలాంటి కల్తీ చేసిన ఉత్పత్తిని టోకు దుకాణాలకు, ఆహార క్యాటరింగ్ సేవలకు సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని అధికారులు అన్నారు. ఆర్థిక లాభం కోసం చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు.