H-FAST : హైదరాబాద్లో ఆహార కల్తీ నియంత్రణకు హెచ్-ఫాస్ట్.. ఫిర్యాదు చేయండి ఇలా
H-FAST : ఆహార కల్తీ నియంత్రణకు 'హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST) ఏర్పాటు చేశారు. నగరంలో ఆహార భద్రతపై ఈ టీమ్ ఫోకస్ చేయనుంది.
హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో 'హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ విభాగాన్ని గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ ప్రారంభించారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో, పటిష్టమైన యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం.
- విభాగం వివరాలు: బృందం: హెచ్-ఫాస్ట్ (H-FAST) విభాగంలో ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు.
- బాధ్యతలు : ఆహార కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిఘా ఉంచడం, దాడులు నిర్వహించడం, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం వీరి ప్రధాన బాధ్యత.
- సమన్వయం: ఈ బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తూ, సమర్థవంతమైన పర్యవేక్షణను నిర్ధారిస్తుంది
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎన్.రంజిత్ కుమార్ గౌడ్, అంజయ్య, సబ్-ఇన్స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ, ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్
ఆహార కల్తీ లేదా అసురక్షిత ఆహార పదార్థాల గురించి సమాచారం అందించడానికి ప్రజల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. పౌరులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా హెచ్-ఫాస్ట్ (H-FAST) టీమ్కు పంపవచ్చు.
ఆహార కల్తీ అనేది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే తీవ్రమైన నేరమని, దీనిని అరికట్టడంలో ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. కల్తీకి పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత ఆహార తయారీ కేంద్రాల గురించి సమాచారం అందిస్తూ పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


