హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ తమ శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి బేగ్ను తొలగిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటన విడుదల చేసింది. ఈ హఠాత్ పరిణామానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏఐఎంఐఎం తన అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకుంది. ఈ ప్రకటన ఆధారంగా, మీర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని తెలిపింది. శాసనమండలి చైర్మన్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఏఐఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ మాట్లాడుతూ.. 'మీర్జా రహమత్ బేగ్ను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఏఐఎంఐఎం పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే తెలంగాణ శాసనమండలి చైర్మన్కు రాజీనామా లేఖను సమర్పించాల్సి ఉంటుంది.' అని తెలిపారు.
మజ్లిస్ అధిష్టానం ఈ కఠిన నిర్ణయానికి గల స్పష్టమైన, అధికారిక కారణాలను ప్రకటనలో నేరుగా వెల్లడించలేదు. అయితే పార్టీ ఆంతరంగిక వర్గాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రహమత్ బేగ్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయన తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని, ఈ అంశాన్ని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సహా ఉన్నత నాయకత్వం చాలా తీవ్రంగా పరిగణించిందని సమాచారం.
పార్టీ నిబంధనలను, సిద్ధాంతాలను అతిక్రమించే ప్రజాప్రతినిధులపై ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని ఈ నిర్ణయం ద్వారా మజ్లిస్ నాయకత్వం పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాన్ని పంపింది.
హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల్లో ఏఐఎంఐఎం బలమైన పట్టు కలిగి ఉంది. పార్టీకి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇలా అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా పార్టీ నుంచి తొలగించడం, రాజీనామా చేయమని కోరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రహమత్ బేగ్ తదుపరి అడుగు ఏంటనేది, ఆయన మండలి చైర్మన్కు రాజీనామా సమర్పిస్తారా లేదా అనే అంశాలపై అందరి దృష్టి నెలకొంది.
రహ్మత్ బేగ్ గురువారం ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడకు చేరిన తర్వాత అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయి. దీంతో అదేరోజు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్కు రప్పించినట్టుగా తెలుస్తోంది.
{{/usCountry}}రహ్మత్ బేగ్ గురువారం ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడకు చేరిన తర్వాత అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయి. దీంతో అదేరోజు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్కు రప్పించినట్టుగా తెలుస్తోంది.
{{/usCountry}}