...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్.. నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. జూన్ 8 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్ : జూన్ 8న హైదరాబాద్ నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాదు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వస్తాయి.

Published on: Jun 7, 2026, 17:14:35 IST
Advertisement

భాగ్యనగరంలో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్ మైదానం) వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు ప్రకటించారు.

ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం (జూన్ 8) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం (జూన్ 9) రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు నిరంతరాయంగా అమలులో ఉంటాయి. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, సాధారణ వాహనదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పోలీసులు ఈ క్రింది విధంగా రూట్ మ్యాప్ కేటాయించారు.

ఆర్టీసీ బస్సులు, భారీ వ్యాన్లు: బస్సులు లేదా పెద్ద వ్యాన్లలో ప్రయాణించే వారు గాంధీభవన్ లేదా గృహకల్ప బస్టాప్‌ల మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆటో ప్రయాణికులు: ఆటోల్లో వచ్చే భక్తుల కోసం పోలీసులు నాంపల్లిలోని షెజాన్ హోటల్ వద్ద ప్రత్యేక అలైటింగ్ పాయింట్ (దిగే స్థలం) ఏర్పాటు చేశారు. ప్రయాణికులను అక్కడ దించి ఆటోలు వెంటనే వెనుతిరగాల్సి ఉంటుంది.

సాధారణ వాహనదారులు: నాంపల్లి, మోజాంజాహీ మార్కెట్, అబిడ్స్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించే సాధారణ వాహనదారులు ట్రాఫిక్ ఇరుక్కుపోకుండా ఉండేందుకు ముందస్తుగానే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఏటా మృగశిర కార్తె ప్రవేశించే రోజున బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో ఈ ఉచిత చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వ్యాధితో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంబులెన్సులు, తగినన్ని మందులతో కూడిన వైద్య శిబిరాలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా క్యూలైన్ల మధ్యలో సీపీఆర్ నిర్వహించగల ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతారు. గ్రౌండ్స్ అంతటా సమాచారం స్పష్టంగా వినిపించేలా క్లియర్ ఆడియోతో కూడిన మైకులను అమర్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉన్న కంట్రోల్ రూమ్, ప్రత్యేక వాట్సప్ గ్రూపుల ద్వారా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పంపిణీ ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe