జేఈఈ మెయిన్-2 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించగా అందులో ఏకంగా పది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందినవారే ఉన్నారు.

తెలంగాణ నుంచి మంథా శివ కామేష్, దోర్నాల భవితేష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్నాథ్ ఈ ఐదుగురు టాపర్లుగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన జొన్నల రోషన్ మణిదీ్పరెడ్డి, నరేంద్రబాబుగారి మహిత్, తుంగా దుర్గా సుప్రభాత్, పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్రెడ్డి 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు.
గతేడాదితో పోలీస్తే.. ఈసారి తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు, ఇతర అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ ఉపయోగపడుతుంది. రాబోయే జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకులు సాధించి, అగ్రశ్రేణి ఐఐటీలలో ప్రవేశం పొందడమే తమ లక్ష్యమని టాపర్లు తెలిపారు.
ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 11.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు, స్కోర్కార్డులు, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) జాబితా విడుదల అయ్యాయి.
విద్యార్థులు తమ స్కోర్కార్డులను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు సుమారు 11.23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 (బీఈ/బీటెక్) కోసం దాదాపు 11.06 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మొత్తం హాజరు దాదాపు 93 శాతంగా ఉంది.
JEE మెయిన్లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ పరీక్ష ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రవేశానికి మార్గంగా పనిచేస్తుంది. జేఈఈ మెయిన్ 2026 ఫైనల్ NTA స్కోర్ కాపీ అభ్యర్థుల రిజిస్టర్డ్ ఇ-మెయిల్ చిరునామాకు కూడా పంపిస్తారు.
{{/usCountry}}JEE మెయిన్లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ పరీక్ష ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రవేశానికి మార్గంగా పనిచేస్తుంది. జేఈఈ మెయిన్ 2026 ఫైనల్ NTA స్కోర్ కాపీ అభ్యర్థుల రిజిస్టర్డ్ ఇ-మెయిల్ చిరునామాకు కూడా పంపిస్తారు.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూడొచ్చు