ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరీష్, ఈవో శ్రీ టి. శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు.
కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది - డిప్యూటీ సీఎం పవన్
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోందన్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడరని పునరుద్ఘాటించారు.
{{/usCountry}}ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోందన్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడరని పునరుద్ఘాటించారు.
{{/usCountry}}“ఇక్కడ దీక్ష విరమణకు సత్రం కావాలని అర్చక ప్రముఖులు కోరారు. అది నా మనసులో ఉంది. అక్కడ(ఏపీ) ప్రజల ఆశీసులతో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో టీటీడీ నుండి చెయ్యడానికి ఇది సాధ్యపడింది. దీనికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు చైర్మన్ తో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి అనం రాంనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులందరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చెప్పారు.
“తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు అంజన్న ఆలయానికి గిరి ప్రదక్షిణ లాంటిది ఏర్పాటు చేయడానికి మీరంతా పూనుకుంటే బావుంటది అంటే దీనికి నా వంతు కృషి నేను కచ్చితంగా చేస్తాను అని చెప్పాను.ఇది రామ సేవ, భజరంగబలి సేవ” అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయానికి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య కారణం పవన్ కల్యాణ్ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. భవిష్యత్తులో మరెన్నో గొప్ప కార్యక్రమాలు కొండగట్టు ఆలయంలో చేయబోతున్నామని ప్రకటించారు.