Army Public School RK Puram Recruitment 2026: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్ట్, అడహాక్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
- పీజీటీ (లీగల్ స్టడీస్): 11, 12 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. లా లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ (B.Ed) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరికి నెలకు రూ.40,000 వేతనం అందిస్తారు.
- టీజీటీ (సంస్కృతం): 6 నుండి 10వ తరగతి వరకు బోధించేందుకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ కలిగి ఉండాలి. వీరికి రూ. 38,000 వేతనం ఉంటుంది.
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: రిటైర్డ్ మహిళా అధికారులు లేదా సివిలియన్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. 55 ఏళ్లలోపు వయస్సు ఉండి, కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
- ఎల్డీసీ (LDC): కేవలం ఎక్స్-సర్వీస్మెన్ (ESM) అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- స్కూల్ రిసెప్షనిస్ట్ - పారామెడిక్ (నర్స్) పోస్టులను కేవలం మహిళా అభ్యర్థుల ద్వారానే భర్తీ చేయనున్నారు. రిసెప్షనిస్ట్ పోస్టుకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. పారామెడిక్ పోస్టుకు 10+2తో పాటు నర్సింగ్లో డిప్లొమా చేసి, ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
- ఐటీ, ల్యాబ్ సిబ్బంది: ఐటీ సూపర్ వైజర్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీ సూపర్ వైజర్ పోస్టుకు కంప్యూటింగ్ మరియు హార్డ్వేర్లో డిప్లొమా ఉండాలి. ల్యాబ్ పోస్టులకు 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు అర్హులు.
దరఖాస్తు విధానం…..

ఆసక్తి గల అభ్యర్థులు స్కూల్ అధికారిక వెబ్సైట్ apsrkpuram.edu.in నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారంతో పాటు విద్యా అర్హతల పత్రాలు, అనుభవ ధృువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలి. దీనితో పాటు రూ.250 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ' Army Public School RK Puram' పేరుతో తీసి…. మే 1, 2026 సాయంత్రం లోపు స్కూల్ ప్రిన్సిపాల్(ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, సికింద్రాబాద్) కార్యాలయానికి పంపాలి. కేవలం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టును విడుదల చేసి ఫలితాలను ప్రకటిస్తారు.