సోమవారం(సెప్టెంబర్ 7) ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొననుండగా, వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయినప్పటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఫామ్హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు.
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 1000 రోజులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో గత 1000 రోజుల్లో కేసీఆర్ జీతం కోసం రూ. 1.24 కోట్లు, అలాగే ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇతర సౌకర్యాల కోసం రూ. 21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్పై బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారని అంటోంది. ఈ విషయంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అధికారంలో 1,000 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్షీట్ విడుదల చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అనేక కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పాలనలోనూ వెనుకబడిందని ఆరోపించారు.
గత 1000 రోజుల్లో ప్రభుత్వ పనితీరు కారణంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. నెరవేరని ఎన్నికల హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో పెద్ద ఎత్తున భూములను చేర్చడం, అధికార కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలు వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ కూడా సన్నద్ధమవుతోంది.
{{/usCountry}}గత 1000 రోజుల్లో ప్రభుత్వ పనితీరు కారణంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. నెరవేరని ఎన్నికల హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో పెద్ద ఎత్తున భూములను చేర్చడం, అధికార కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలు వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ కూడా సన్నద్ధమవుతోంది.
{{/usCountry}}నీట్ అంశంపై ఢిల్లీలో ఇటీవల సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనపై రేవంత్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు తగ్గించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలైలో ప్రకటించారు.