బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ పై బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్రవ్యాప్ద బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కు అన్ని పార్టీలతో పాటు అనేక ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. అన్ని పార్టీల నేతలు ఎక్కడికక్కడ బంద్ లో పాల్గొంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే బంద్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

బంద్కు మద్దతుగా పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు నిరనస చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరమే కాకుండా జిల్లాల్లో కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితయ్యాయి.
వ్యాపార, విద్యాసంస్థలు బంద్…!
బీసీ సంఘాల బంద్ నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛద్ధంగా మూసివేసి మద్దతు ప్రకటించాయి. ఇక పలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాలు కూడా ఇవాళ బడులను మూసివేస్తున్నట్లు ముందుగానే ప్రకటించాయి. దీంతో చాలా స్కూళ్లు తెరుచుకోలేదు.
బీసీ బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఎల్ఎల్బీ, బీటెక్, ఎమ్మెస్సీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ (బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీ), ఎంటెక్, సి.ఎల్ .ఐ .ఎస్ .సి (దూరవిద్య) పరీక్షలను వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నారు. ఇక ఓయూ పరిధిలో జరుగుతున్న పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. మిగతా అన్ని పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఆయా యూనివర్శిటీల అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు దీపావళి పండగ ఉండటంతో చాలా మంది ఊర్లల్లోకి వెళ్తున్నారు. అయితే ఇవాళ బంద్ కొనసాగుతుండగా… ప్రయాణీకులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో, సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు కొనసాగుతుండగా… రద్దీ ఎక్కువగానే ఉంది.
{{/usCountry}}మరోవైపు దీపావళి పండగ ఉండటంతో చాలా మంది ఊర్లల్లోకి వెళ్తున్నారు. అయితే ఇవాళ బంద్ కొనసాగుతుండగా… ప్రయాణీకులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో, సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు కొనసాగుతుండగా… రద్దీ ఎక్కువగానే ఉంది.
{{/usCountry}}