బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో(POCSO) కేసు నమోదైన నేపథ్యంలో ఆయన గత మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్!

పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనప్పటి నుండి భగీరథ్ ఆచూకీ లభించడం లేదు. సిట్ అధికారి రితిరాజ్ ప్రకారం, గత మూడు రోజులుగా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పోలీసుల కళ్లు గప్పి ఆయన ఎక్కడో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంపై మరింతగా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసామని, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది?
ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో జరిగిన పార్టీలో తనపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక ఆరోపించింది. ఆ ఘటన తర్వాత కూడా తనను మానసికంగా వేధించాడని, ఆ తట్టుకోలేక తాను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఈ కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కూడా కరీంనగర్లో ఒక ఫిర్యాదు చేశాడు. ఆ బాలిక కుటుంబం తనను హనీట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందని, రూ. 50 వేలు వసూలు చేశారని ఆయన ఆరోపించాడు. రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. సిట్ ఏర్పాటు
ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, నిందితుడు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. డీజీపీ సీవీ ఆనంద్తో మాట్లాడిన సీఎం, కేసు విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
రాజకీయ ప్రకంపనలు
బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ బీజేపీ స్పందిస్తూ.. ఇది ఒక చట్టపరమైన అంశమని, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.
{{/usCountry}}బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ బీజేపీ స్పందిస్తూ.. ఇది ఒక చట్టపరమైన అంశమని, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.
{{/usCountry}}ప్రస్తుతం పోలీసులు భగీరథ్ కాల్ డేటా రికార్డులను (CDR) విశ్లేషిస్తున్నారు. ఈ 'హై ప్రొఫైల్' కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.