కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "భారతీయ జనతా పార్టీ (BJP) లో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన సిపాయిలే. క్రమశిక్షణ, దేశభక్తి, కమిట్మెంట్తో పనిచేసే కరడుగట్టిన బీజేపీ కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. తాను చనిపోయిన తర్వాత తన పార్థివదేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటాడు." అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఇటీవల తన కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు, తదనంతర రాజకీయ పరిణామాలపై సంజయ్ సూటిగా స్పందించారు. తనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
చట్టం ముందు అందరూ సమానమే
"కన్నకొడుకును విచారణ కోసం పోలీసులకు స్వయంగా అప్పగించిన తండ్రి ఎవరైనా ఉన్నారా? చట్టంపై గౌరవంతో, విచారణకు సహకరించాలనే ఉద్దేశంతోనే నా కుమారుడిని పోలీసులకు అప్పగించా. చట్టం ముందు ఎవరైనా సమానమే. నా కుమారుడు తప్పు చేయలేదని చెబుతున్నాడు, న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీ
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లను లక్ష్యంగా చేసుకుని సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. "లోక్సభలో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేని కేసీఆర్ పార్టీ.. ఫామ్హౌస్లో కూర్చుని నీతులు చెబుతోంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చింది, ఆ కుటుంబ నియంతృత్వ పాలనను అంతం చేసింది బీజేపీనే. ఆ కక్షతోనే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు" అని మండిపడ్డారు. కేటీఆర్ ఒక ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతూ, తమపై బురదజల్లేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించానని, సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను తొలగించాలని కోరినట్లు సంజయ్ తెలిపారు. తాను ఎలాంటివాడినో తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
{{/usCountry}}తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించానని, సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను తొలగించాలని కోరినట్లు సంజయ్ తెలిపారు. తాను ఎలాంటివాడినో తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
{{/usCountry}}కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని బండి సంజయ్ అన్నారు. అలాంటి లీడర్ తాను కాదని స్పష్టం చేశారు. 'కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన తండ్రిని నేను. నన్ను భర్తరఫ్ చేస్తారని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. నేను కొత్త పార్టీ పెట్టేది లేదు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు.' అని సంజయ్ అన్నారు.