Birth Certificate : 3 నుంచి 5 రోజుల్లో చేతికి బర్త్, డెత్ సర్టిఫికేట్లు.. తెలంగాణలో కొత్త పోర్టల్
Birth Certificate : జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం తెలంగాణలో కొత్త పోర్టల్ రానుంది. దీనితో 3 నుంచి 5 రోజుల్లోనే అప్లై చేసినవారికి బర్త్, డెత్ సర్టిఫికేట్లు వస్తాయి.
జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదును ఆన్లైన్లో నిర్వహించే లక్ష్యంతో తెలంగాణలో త్వరలో ఒక కొత్త పోర్టల్ ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) పోర్టల్ను అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత CRS వ్యవస్థ దరఖాస్తుదారులకు 3–5 రోజుల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందేలా చూస్తుంది. ప్రస్తుతం జనన, మరణ ధృవీకరణ పత్రాలకు సమయం పడుతుంది. దీంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా త్వరగా చేతికి సర్టిఫికేట్లు వస్తాయి.

కొత్త పోర్టల్ దరఖాస్తుదారులకు జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం సహాయక పత్రాలతో ఆన్లైన్లో ఫారాలను నింపడంలో సహాయపడుతుంది. ఆలస్యంగా నమోదు చేసుకోవడానికి కూడా ఈ పోర్టల్ను ఉపయోగించవచ్చు. ఆమోదం పొందిన తర్వాత, తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను పోర్టల్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023 చట్టంగా మారిన తర్వాత, 2023 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరూ తమ పుట్టిన తేదీని నిరూపించుకోవడానికి, జనన మరణాల రిజిస్ట్రార్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 (18 ఆఫ్ 1969) కింద అధికారం పొందిన ఏదైనా ఇతర అధికార సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
బర్త్, డెత్ సర్టిఫికేట్లు చాలా పనుల కోసం కావాలి. పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి, జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని చట్టంలో ఉంది. ఈ పనుల కోసం బర్త్ సర్టిఫికేట్ కావాలి. విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం, ఓటర్ల జాబితా తయారీ, వివాహ నమోదు, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న ఏదైనా శాసనబద్ధ లేదా స్వయంప్రతిపత్తి గల సంస్థలో ఒక పదవికి నియామకం కోసం, పాస్పోర్ట్ జారీ చేయడం, ఆధార్ కార్డు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఇతర ఏ ప్రయోజనానికైనా బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది.
మరోవైపు, పూర్వీకుల ఆస్తులను వారసులకు బదిలీ చేయడానికి, జీవిత బీమా, పింఛన్లను క్లెయిమ్ చేయడానికి, భర్త చనిపోతే.. భార్యకు పెన్షన్ అప్లై చేయడానికి మరణ ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


