రోడ్లు బాగుంటే మరిన్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చేవెళ్ల లోక్ సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మన్నెగూడ, పరిగి మీదుగా వెళ్ళే హైదరాబాద్-బీజాపూర్ (కర్ణాటక) రహదారిలోని తెలంగాణ భాగంలో భూసేకరణ పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని.. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

"ఈ రోజుల్లో రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్లి… తక్కువ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్లు ఎంత మెరుగ్గా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయి "అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పట్టించుకోలేదు - ఎంపీ కొండా
చేవెళ్ల రహదారిని నిజాం కాలంలో నిర్మించారని… అప్పటి పాలకులు వేసవి కాలంలో అనంతగిరి కొండలకు వెళ్లడానికి దీనిని ఉపయోగించారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. రోడ్లు పాడైపోయినప్పటికీ అదే వంకర రహదారి ఇప్పటికీ ఉపయోగించబడుతోందన్నారు. తాను తొలిసారిగా చేవెళ్ల ఎంపీ అయినప్పుడు రహదారిని మరమ్మతు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించానని చెప్పారు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించానని గుర్తు చేశారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితో పాటు ప్రకటించిన మరో ఎనిమిది జాతీయ రహదారులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేయలేదన్నారు. ఐదేళ్లుగా భూసేకరణ పూర్తి కాలేదు.2016లో బీజాపూర్ జాతీయ రహదారిని ప్రకటించినప్పటికీ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా వదిలేసిందని ఆయన ఆరోపించారు.
రహదారి వెంబడి అనేక మర్రి చెట్లు ఉన్నప్పటికీ వాటిని మార్చవచ్చని ఆయన చెప్పారు. వంకర మార్గాలను తప్పించి… భూసేకరణ జరిగితే, అనేక చెట్లను కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు. దూరం కూడా తగ్గుతుందని అన్నారు.
{{/usCountry}}రహదారి వెంబడి అనేక మర్రి చెట్లు ఉన్నప్పటికీ వాటిని మార్చవచ్చని ఆయన చెప్పారు. వంకర మార్గాలను తప్పించి… భూసేకరణ జరిగితే, అనేక చెట్లను కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు. దూరం కూడా తగ్గుతుందని అన్నారు.
{{/usCountry}}కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే ఇటీవలనే అన్ని కేసులు క్లియర్ అయ్యాయని చెప్పారు. ఇప్పటికైనా వేగంగా రోడ్డు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద సోమవారం జరిగిన ఘటనలో టిప్పర్ లారీ ప్రభుత్వ బస్సును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన 30 మందిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.