కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రకటిస్తూ.. జెండాను కూడా విడుదల చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న ఇప్పటి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తన సోషల్ మీడియా ఖాతాలో కవిత కొత్త పార్టీపై మీమ్ వదలింది.

మార్కెట్లో ఎక్కువగా ఉపయోగించే ఓ కంపెనీకి చెందిన వాటర్ బాటిల్, టూత్ పేస్ట్ మీద వచ్చిన డూప్లికేట్ ప్రోడక్ట్స్తో కవిత పార్టీని పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు. నేరుగా కవిత పార్టీ పేరును ప్రస్తావించకపోయినా.. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ.
మేడ్చల్లోని మునీరాబాద్లోని ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని కవిత ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు.
{{/usCountry}}మేడ్చల్లోని మునీరాబాద్లోని ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని కవిత ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు.
{{/usCountry}}ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలను గుర్తుచేసుకున్నారు. గతంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ తప్పులలో నేను కూడా భాగమేనని చెప్పారు కవిత. భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూస్తానని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా అన్నారు.
అపారమైన పోరాటం నుండి పుట్టిన ఒక నూతన రాజకీయ శక్తిగా తెలంగాణలో ఒక కొత్త విప్లవం ప్రారంభమైందని కవిత అన్నారు. ఈ రోజు మరచిపోలేనిదని అభివర్ణిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును సురక్షితం చేయడానికి సామూహిక భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆశయం కోసం పడిన కష్టాలను, చేసిన పోరాటాలను కవిత గుర్తుచేసుకున్నారు. ఈ ఉద్యమ సమయంలో కోల్పోయిన ప్రాణాలతో సహా చేసిన త్యాగాలను ప్రస్తావించారు.
టీఆర్ఎస్తో కలిసి ప్రజల ముందుకు వస్తున్నా అన్నారు కవిత. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ కవిత బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నారని ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.